కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు. శుకవారం జనహిత భవన్లో ఆర్డిఓలు, పంచాయితీరాజ్ ఇంజనీర్లతో వైకుంఠధామం పనులను మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామాలలో మిగిలిన లక్ష్యాన్ని వెంటనే పూర్తి అయ్యేలా క్షేత్రస్థాయిలో ఎఇ, డిఇలు పర్యవేక్షించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ పనులకు సంబంధించి ఇసుక కొరత లేదని, ఆర్డిఓల సహకారంతో ఇసుక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ...
Read More »తాజా వార్తలు
బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషిచేస్తామని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శరత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాల రక్ష భవన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామన్నారు. బాలికలపై రోజురోజుకు వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కమిటి పనిచేస్తుందన్నారు. పసికందులను విక్రయించడం, అనధికారిక దత్తతను తీసుకోవడం నేరమని అలాంటివి ఎక్కడైనా జరిగితే ...
Read More »పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో నీటి దినోత్సవంలో భాగంగా శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే నీళ్లు పట్టారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. నర్సరీలో మొక్కలు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి నవనీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) వైకుంఠధామాలు ...
Read More »తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కో ఆర్డినేటర్గా డి.యల్.యన్.చారి
నిజామాబాద్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1993 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేసిన, తెలంగాణ ఉద్యమం అనుభవం ఉన్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్గా నియమించడం రాష్ట్ర కమిటిలో మంచి పరిణామమని రాష్ట్ర కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఫోరమ్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ డా. చీమల శ్రీనివాస్ చేతులమీదుగా నియామక పత్రాన్ని డి.యల్.యన్.చారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర ...
Read More »ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్
ఆర్మూర్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక దామోదర వీర సావర్కర్ 55 వ వర్ధంతిని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లొ నిర్వహించారు. వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ బిజెపి అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాలెపు రాజ్ కుమార్ు మాట్లాడుతు వినాయక దామోదర్ సావర్కర్ ఓ ప్రఖంఢ దేశభక్తుడని, ...
Read More »ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం – న్యాయవాదుల నిరసన
నిజామాబాద్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు న్యాయవాదులు వామనరావ్ నాగమణి దంపతుల జంట హత్యలను నిరసిస్తూ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషస్స్ పిలుపుమేరకు ఆందోళనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచి కట్ల గోవర్థన్ మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని ...
Read More »కామారెడ్డిలో విశ్వ ఆగ్రోటెక్ సేవలు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆయిల్ఫామ్ సాగుపై జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో విశ్వ ఆగ్రోటెక్ సంస్థ ప్రతినిధులు గురువారం జిల్లాకలెక్టరు డాక్టర్ ఎ.శరత్ని కలిసి జిల్లాలో తాము చేపట్టే ఆయిల్ ఫామ్పై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విశ్వ ఆగ్రోటెక్ సంస్థ ద్వారా ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్ కోసం రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ సహకారంతో నాణ్యమైన ఫామ్ ఆయిల్ మొక్కలను, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ద్వారా అందచేయడం జరుగుతుందని, మొక్క ...
Read More »ఎంపీ బి.బి పాటిల్కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఎంపీ బి.బి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ...
Read More »అధికారులు పాజిటివ్ థింకింగ్తో పని చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే కొంత పాజిటివ్గా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్గా ప్రమోషన్తో పాటు బదిలీపై హైదరాబాద్ వెళుతున్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీరాములుకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిపివోకు జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ...
Read More »ఆదర్శం సనత్ కుమార్ శర్మ
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో గురువారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన సనత్ కుమార్ శర్మ 59వ సారి ఏ పాజిటివ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గతంలో ఆర్.కె. కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న సందర్భంలో ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం జరిగిందని వీరి లాంటి వ్యక్తుల స్ఫూర్తితోనే కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ...
Read More »వినియోగదారుల రక్షణ చట్టం పుస్తక ఆవిష్కరణ
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం పుస్తకం ప్రతిఒక్క వినియోగదారుడి చేతికి ఆయుధమని, అందరికి అర్ధమయ్యే విధంగా ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. చట్టాన్ని ప్రతిఒక్క వినియోగదారుడు తెలుసుకుని రక్షణ కలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి ...
Read More »గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…?
మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ప్రసాద వితరణలో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బున్న ...
Read More »వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత
బాల్కొండ, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్(బి) గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసము పలు సూచనలు, సలహాలు అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వాటిని పర్యవెక్షించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు ...
Read More »26లోగా పూర్తి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 లోగా కస్టమ్ మిల్లింగ్ రైన్ (సిఎంఆర్) పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో సిఎంఆర్పై సమీక్షిస్తూ, ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు మిగిలివుందని, ఈనెల 26 లోగా పూర్తి చేసి ఎన్సిఐకి అందచేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. అనంతరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, ...
Read More »విపత్తుశాఖ వారి మోబైల్ యాప్ ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన పిడుగుపాటుపై జాగ్రత్తలు, పిడుగుపాటు సంకేతాలు, పిడుగు పడే ప్రదేశాలు, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగత్తలు చేయకూడని పనులను తెలియచేసే పోస్టర్ను, అలాగే రాష్ట్రంలోని ప్రాంతాల వాతావరణ వివరాలను తెలియచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సొసైటీ వారి ఆధ్వర్యంలో రూపొందించిన టిఎస్ వెదర్ మోబైల్ యాప్, పోస్టర్ను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ బుధవారం తన ఛాంబర్లో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ...
Read More »సినిమా
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని ...
Read More » -
యానంపల్లిలో పోలీసు కళాజాత
-
దోపిడీ దొంగల అరెస్టు
-
మనల్ని మనం కాపాడుకుందాం…
-
అట్రాసిటీస్ కేసులు త్వరగా పరిష్కరించాలి
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!