కామారెడ్డి, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడి ఉద్యోగులకు, ఆయాలకు మే 1వ తేదీ నుంచి నెలరోజుల సెలవులు మంజూరు చేయాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి ఐసిడిఎస్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాచేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.యాదమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్లు మాట్లాడారు.
అంగన్వాడిల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అనేకసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యల పరిష్కారం పట్ల మొగ్గుచూపకపోవడం గర్హణీయమన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించలేదని, వేసవి సెలవులు అమలు చేయలేదని, వెంటనే వీటికి సంబంధించిన జివోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజలింగం, కార్మికులు సునంద,కల్పన, ఇందిరా, జరీనా, భారతి, తదితరులు పాల్గొన్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018