నందిపేట, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పంట బీమా డబ్బులు నిజమైన లబ్దిదారులకు అందడం లేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డి అన్నారు. అనర్హులు పొందడం వల్ల అర్హులకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి సర్వే జరిపి దాని ప్రకారం నిజమైన అర్హులకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు, సంజీవ్రాజ్, హన్మాండ్లు, చిన్నదొడ్ల కిషోర్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్, వినయ్, తదితరులున్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018