బీర్కూర్, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ ప్రధాన కాలువ డిస్టిబ్యూటరీ 25 వద్ద శుక్రవారం మహిళ శవం గుర్తించినట్టు ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గాంధారి మండలం ముధోల్ గ్రామ పంచాయతీ గల నర్సాపూర్ గ్రామానికి చెందిన తోట లక్ష్మి (50) గురువారం బోర్లం క్యాంప్ గ్రామ శివారులో గల తన స్వంత పొలానికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళింది. ఈక్రమంలో సాయంత్రం కాలికి అంటిన బురద కడుక్కొనే నిమిత్తంతో బోర్లం క్యాంప్లో గల నిజాంసాగర్ ప్రధాన కాలువ వద్దకెళ్ళి అకస్మాత్తుగా కాలుజారి పడిపోయిందని తెలిపారు. సంబందిత సమాచారం తెలుసుకున్న నసురుల్లాబాద్ పోలీసులు గురువారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం శవం లభించిందన్నారు. మృతదేహనికి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ అనిల్రెడ్డి వివరించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది - January 22, 2021
- అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు - January 22, 2021
- సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి… - January 22, 2021