కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం దేవునిపల్లి శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు తెలిపారు. ఉదయం స్వామివారికి సిందూర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
భజరంగ్దళ్ ఆద్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం భారీ బైక్ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రతినిధులు తెలిపారు. కోడూరి హనుమాన్ ఆలయం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021