కామరెడ్డి, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తలసేమియా వ్యాధితో చికిత్స పొందుతున్న 1 సంవత్సరం పాపకు అత్యవసర సమయంలో అంజయ్య రక్తదానం చేశారు. గాంధారికి చెందిన 1 సంవత్సరం పాప మౌనిక తలసేమియా వ్యాధితో కామారెడ్డి ఆర్కె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరముందని టీజీవిపి నాయకులను సంప్రదించారు.
టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్ స్పందించి కామారెడ్డికి చెందిన అంజయ్యతో రక్తదానం చేయించారు. అంజయ్య స్వచ్చందంగా రక్తదానం చేసి తన సేవ దృక్పథాన్ని చాటారు. కార్యక్రమంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్, శివ కుమార్, వి.టి. ఠాగూర్ రక్తనిథి కేంద్రం నిర్వాహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది - January 22, 2021
- అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు - January 22, 2021
- సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి… - January 22, 2021