నిజామాబాద్, సెప్టెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ మిషన్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలపై ఎమ్మార్వోలు, ఎండివోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే చాలా సమయం ఇవ్వడం జరిగిందని, వచ్చే వారంలోపు ప్రతి గ్రామంలో పూర్తి కావాలని, స్థలం లేనట్లయితే కొని ఇస్తామని, పల్లె ప్రకృతి వనం ఒక్క ఎకరంలో ఉండాలని, దానిలో 4 వేల మొక్కలు పెట్టాలని, ఒక వేళ సగం ఎకరం ఉంటే 2 వేల మొక్కలు పెట్టాలని, డెన్స్ ప్లాంటేషన్ ఉండాలని, పల్లె ప్రకృతి వనానికి గేట్, బోర్డ్, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ వుండే విధంగా తయారు చేయాలని, దానికి ఒక వన సేవకుడిని పెట్టాలని, పల్లె ప్రకృతి వనంలో బయటి వరుస పెద్ద మొక్కలు పెట్టాలని, అవి మంచి మొక్కలు అయి వుండేవిదముగా చూడాలని, అదేవిధంగా హరితహారంలో ప్రతి జిపి పరిధిలో రోడ్కు ఇరువైపులా ప్రతి 5 మీటర్లకు ఒక్క మొక్క పెట్టాలని, ప్రతి మొక్కా బ్రతకాలని, లేనిపక్షంలో పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి క్రిమటోరియం దగ్గర మంచి మొక్కలు పెట్టాలని, పిచ్చి మొక్కలు ఉండరాదని, వెయ్యి మొక్కలు పెట్టాలని, కంపోస్ట్ షెడ్ దెగ్గర కూడా మొక్కలు పెట్టాలని, గేదెలు రాకుండా చూడాలని, అవి వచ్చే అవకాశమున్న దగ్గర డబల్ ఫిన్షింగ్ చేయాలని, ప్రతి జిపిలో ఏడుగురు వన సేవకులు వుండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మాడల్ వైకుంఠ దామాలు దేశానికి ఆదర్శం కావాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణంలో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు, అధికారులందరి సహకారంతో మొదటి స్థానం తేవాలని, ప్రతి జిపిలో వైకుంఠ దామం ఉండాలని, పూర్తికాని చోట 15 రోజులలో పూర్తి చేయాలని, వైకుంఠ దామం చుట్టూ మంచి మొక్కలు పెట్టి ఒక వన సేవకుడిని నియమించాలని, వైకుంఠ రథం, ఫ్రీజ్ కూడా వుండేటట్టు చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకొని పని చేయాలని, స్వచ్ఛభారత్ కోసం యాక్టివ్గా ఉన్న గ్రామ పంచాయతీలను మండలానికి రెండు ఎంపిక చేయాలని ఎంపీడీఓకు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్లో డబ్బు రావాలంటే మీ గ్రామాలలో ఉన్న పరిస్థితులు మారాలని, చెత్త నిర్వహణ మీద దృష్టి పెట్టాలన్నారు. చెత్త నిర్వహణలో మండలానికి రెండు గ్రామ పంచాయతీలు సెలెక్షన్ చేయడం జరిగిందని, ఆ రెండు గ్రామపంచాయతీలో సిస్టమేటిక్గా చెత్త నిర్వహణ చేయగలిగితే ఆ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి అదనపు ఫండ్ వస్తుందని, గ్రామం హెల్త్ పరంగా శానిటేషన్ పరంగా చాలా రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, హాస్పిటల్ ఖర్చు తగ్గుతాయన్నారు. మండల హెడ్ క్వాటర్ గ్రామ పంచాయతీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ స్టాండర్డ్లో పనులు చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. పల్లె ప్రగతి పనులు స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తొందరగా పూర్తి చేయాలని. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఇవ్వడం జరిగిందన్నారు. వైకుంఠ ధామాలు గ్రామాలలో పేద వారు చనిపోయినా, ధనికుడు చనిపోయిన వైకుంఠధామానికి గౌరవప్రదంగా వెళ్లేలా ఉండాలని, వైకుంఠధామం పార్కులా మార్చాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని, వైకుంఠ దామం విషయంలో మీ మండలాన్ని ఆదర్శంగా మార్చాలని, వన సేవకులు రెండు గంటలు గ్రామంలో శానిటేషన్ పనులు చేయాలని, మిగతా సమయం మొక్కలను పెంచాలని, జిపి నుండి వన సేవకునికి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని, మొక్కలు పెంచకుంటే సోషల్ ఆడిట్లో ఇబ్బంది అవుతుందని, ఏవిన్యూ ప్లాంటేషన్ అయితే నాలుగువందల మొక్కలకు ఒకరిని, వైకుంఠధామం కంపోస్ట్ షెడ్డులో ఒక్కరిని మొక్కలు పెంచుటకు ఏర్పాటు చేయాలని, ఒకరికి వెయ్యి మొక్కలు అప్పగించాలని, గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ వచ్చిన గ్రామాలలో త్రాగునీటి బోర్లు వాడరాదని, వాటి విద్యుత్ వృధా ఖర్చు అవుతుందని గ్రామ పంచాయతీకి అదనపు భారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, జడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021