హైదరాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు, అధిక ఆశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పుల్ని పండితులు చెప్పారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, ...
Read More »Daily Archives: September 14, 2020
గడువు అక్టోబర్ 30కి పెంచారు
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ శాఖ, ఐ.టి శాఖ మాత్యులు కెటిఆర్ నిర్వహించిన మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పాల్గొన్నారు. సోమవారం మేయర్లు, కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్టం స్వచ్ఛ నిర్వహణలో ముందు భాగంలో ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆదేశాలిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, చెత్త ...
Read More »నిజాంసాగర్లో కరోన కేసులు నిల్
నిజాంసాగర్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా ఎవరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని మండల వైద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. నిజాంసాగర్లో మొత్తం 193 కేసులు కాగా, కోలుకున్నవారు 62 మంది, ఒకరు కరోనాతో మరణించారన్నారు. కరోనా పాజిటివ్ కేసులు కొమలాంచ 2, తుంకిపల్లి 7, గాలి పూర్ 4, గునుక్కల్ 9, శేర్ఖాన్ పల్లి 1,మల్లూర్ 9, సింగీతం 7, మగ్దూంపూర్ ...
Read More »ఫోన్ ఇన్లో 19 ఫిర్యాదులు
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన పోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 19 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 8, ఉపాధి హామీ 4, వ్యవసాయం, పంచాయతీ, వైద్య శాఖకు 2 చొప్పున, విద్యుత్తు శాఖకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు ...
Read More »15 నుంచి వ్యాధి టీకాల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గొర్రెలు, మేకలు ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమైనదని, గొర్రెలకు, మేకలకు ప్రబలే అంటూ వ్యాధులు పిపిఆర్ వ్యాధి వల్ల కలిగే మరణాలు తగ్గించి గొర్రెలు మేకల పెంపకం దారులకు లబ్ధి చేకుర్చుటకు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ప్రతి ఏట పిపిఆర్ టీకాలు నిర్వహిస్తారని కామారెడ్డి జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాలు ముఖ్యంగా మందలో కొత్తగా చేరిన ...
Read More »గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీసన్లో అత్యధికంగా పండనున్న 7 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లు మరియు డీలర్లను రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మరియు డిస్ట్రిక్ట్ మానేజర్, సివిల్ సప్లైస్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి. సోమవారం జిల్లాలోని వ్యవసాయ, సివిల్ సప్లైస్, కో-ఆపేరటివ్ ...
Read More »వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జెసిఐ ఇందూర్ కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు ఉద్బోదించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. జేసీస్ వారోత్సవాల్లో భాగంగా జేసిఐ ఇందూర్ ఆద్వర్యంలో సోమవారం వెల్త్ అవుటాప్ ద వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, ప్రజలకు బట్ట సంచులు, కాగితపు కవర్లు పంపిణీ చేశారు. అనంతరం జెసిఐ ఇందూర్ కార్యదర్శి హన్మాండ్లు మాట్లాడుతూ ...
Read More »టి ఐడియా పాలసీలో వాహనాల మంజూరు
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టర్ ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి. టి ఐడియా పాలసీ క్రింద ఇద్దరికి వికలాంగులు మరియు బీసీ (సి) కోటా క్రింద ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్ మరియు గూడ్స్ లైట్ మోటార్ వెహికల్ మంజూరు చేశారు. అదేవిధంగా టి ప్రైడ్ పాలసీ క్రింద 16 మంది ఎస్సీలకు కూడా ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వెహికల్స్, కార్లు మంజూరు ...
Read More »15న విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15వ తేదీ మంగళవారం నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి యం.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. పూలాంగ్, కోటగల్లి, గోల్హనుమాన్, జెండాగల్లి, శివాజీ నగర్, పద్మనగర్, హనుమాన్ నగర్, హోటల్ నిఖిల్ సాయి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
Read More »15న కాగడాల ప్రదర్శన
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కామారెడ్డిజిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 15న కాగడాల ప్రదర్శన, మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాక ముందు విమోచన దినోత్సవం ...
Read More »ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరిపై పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ విధానాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కే.భూమయ్య, సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు నూర్జహాన్, లతా, గోవర్ధన్, సూరి, ఓమయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Read More »