నిజామాబాద్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుందని రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. గురువారం తేదీ 24 నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు చేయనివారు ఎలాంటి విద్యార్హత లేకుండా 18 సంవత్సరాల వయస్సు ఉండి ఎస్ఎస్సి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారు డిగ్రీ చేయుటకు ఆసక్తి కలిగిన వారు వెంటనే తమ సర్టిఫికెట్లను తీసుకెళ్లి రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ నందు సెప్టెంబర్ 26 న మధ్యాహ్నం వరకు నేరుగా వెళ్లి తమ సర్టిఫికెట్లు మరియు ఒక ఫోటో తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. ఇతర వివరాల కొరకు 7382929612 ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవాలని తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021