నిజాంసాగర్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలలో మరిన్ని మొక్కలను ఉద్యమంలా నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రకతి వనంలో ఎక్కువ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ హేమంతు కేశవ్ పాటిల్, ఎంపీడీవో తోట పర్బన్నా, తహసీల్దార్ సత్యనారాయణ, ఈసీ గణేష్ నాయక్, నాయకులు యటకారి నారాయణ, తదితరులు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021