నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ దివస్గా పాటిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం సాధించడంలో సాయుధ ఆర్మీ ద్వారా విశేష కషి చేశారని చెప్పారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ ...
Read More »Daily Archives: January 23, 2021
ఈనెల 25 నుండి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సిన్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రైవేటు హెల్త్ కేర్ వారియర్స్కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు కోవీడు వ్యాక్సినేషన్పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25 నుండి ఒక్కో కేంద్రంలో 100 ...
Read More »విజయ డైరీ 30 శాతం రాయితీ ఇస్తుంది
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ యువత ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్ డెమో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతలు, జాతర్లు జరిగే చోట వాహనంపై పాల పదార్థాలు తీసుకెళ్లి విక్రయించు కోవాలని సూచించారు. బ్యాటరీతో ఆటో నడుస్తుందని, 10 గంటల పాటు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలపాటు ఈ కార్ట్ పనిచేస్తోందని తెలిపారు. వాహనం ధర ...
Read More »24 గంటల పాటు నడిపించి లక్ష్యాలు పూర్తి చేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 28 లోగా రైస్ మిల్లుల యజమానులు వడ్లను మర పట్టించడం (మిల్లింగ్) ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రైస్ మిల్లు యజమానులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రైస్ మిలర్లతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. యాసంగి మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లులను 24 గంటలపాటు నడిపించి లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. టెలీ కాన్ఫరెన్సులో ...
Read More »బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 కి ఎంపిక చేయబడ్డారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ జారీచేసిన జాబితాలో ఆయన రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ముగ్గురు అధికారులలో ఒకరిగా ఎంపిక చేయబడ్డారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందించే అవార్డుల జాబితాను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. నిజామాబాద్ అర్బన్కు చెందిన ఖనీజ్ ఫాతిమా బెస్ట్ బిఎల్ఇగా అవార్డుకు ఎంపికయ్యారు.
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ, ఎం.ఎడ్., పీజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి శనివారం కూడా ప్రశాంతంగా జరిగాయి. కాగా డిగ్రీ పరీక్షా కేంద్రాల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు సమాచారం అందింది. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 275 నమోదు చేసుకోగా 230 హాజరు, 40 గైర్హాజర్ అయ్యారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎం.ఎడ్. నాల్గవ ...
Read More »కార్మికులు విధులు తనిఖీ చేసిన మేయర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నగరంలోని గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద గల మున్సిపల్ జోన్ 2 కార్యాలయన్ని ఉదయం 5 గంటలకు నగర మేయర్ నీతూ కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి కార్మికులు విధులకు సకాలంలో హాజరు కావాలని విధులను సక్రమంగా నిర్వర్తించి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికులకు అందించిన గ్లౌస్లు, షూస్, మాస్కులు ధరించి జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ...
Read More »ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎంకు లేఖ
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని అలాగే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ఉపకులపతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసి దానిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేశారు. అనంతరం వేణు రాజ్ మాట్లాడుతూ కెసిఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అలాంటిది ...
Read More »గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26న నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సింపుల్గా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పుడూ నిర్వహించుకునే సమయానికే వారి కార్యాలయాలలో చేసుకున్న తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్కు జిల్లా అధికారులు, సిబ్బంది హాజరుకావాలని తెలిపారు. ఈ ...
Read More »