కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నాలుగు కొత్త బార్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి రెండు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి చొప్పున మొత్తం నాలుగు కొత్త బార్ల కోసం ఈనెల 25 వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు ఆఫీసు పని దినములలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి కామారెడ్డి కార్యాలయము, డిప్యూటీ కమిషనర్, నిజామాబాదు మద్యనిషేధ అబ్కారీ కార్యాలయము, మద్య నిషేధ, అబ్కారీ కమిషనర్ కార్యాలయము, నాంపల్లి, హైదరాబాదు కార్యాలయములలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఫిబ్రవరి, 10 వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరు సమక్షములో డ్రా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కొరకు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి, కామారెడ్డి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021