బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో నాబార్డు ఏం.ఎస్.సి స్కీం ద్వారా ఎన్నికయిన ప్రాధమిక సహకార సంఘాలకు గోదాం నిర్మాణమునకు రుణ మంజూరు పత్రాలను సంబంధిత చైర్మన్లకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో గజానంద్, డీసీసీబీ డైరెక్టర్లు కిష్ట గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, సంగ్రామ్ నాయక్, ఆనంద్, శంకర్, లింగయ్య, చైర్మన్లు గంగా రెడ్డి, గంగారాం, కార్తిక్ రెడ్డి, గోవర్ధన్ ...
Read More »Daily Archives: February 4, 2021
జిల్లాలో 400 ఎకరాలు కొనుగోలు చేశాం
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నాలుగు వందల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ జిఎం ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు నాలుగువందల ఎకరాలు కొనడం జరిగిందని, అందుకు 18 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 400 ఎకరాలలో 79 బోర్ వెల్స్ వేయడానికి ప్రభుత్వానికి గ్రౌండ్ ...
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణం మరియు బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, దేశాయిపేట, పోచారం గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముందుగా తాడ్కోల్ గ్రామంలోని అంబేడ్కర్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని పరిశీలించి నిర్మాణ పనులపై ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం దేశాయిపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ...
Read More »17 నుంచి బి.ఇడి మూడవ సెమిస్టర్ పరీక్షలు
డిచ్పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. కళాశాలలో ఈ నెల 17, 18 మరియు 19 వ తేదీలలో బి.ఎడ్. మూడవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు జరుగనున్నట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. కావున బి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు మరియు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.
Read More »9, 10 తేదీల్లో వాలీబాల్ టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదినం పురస్కరించుకుని ఎంఎల్సి కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి అన్నారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల 9,10 తేదీలలో నిజామాబాద్ పట్టణంలోని డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. ...
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
బోధన్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సాలూర గ్రామంలో ఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా వికర్ సెక్షన్ కాలనీలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సాలూరా గ్రామ అభివృద్ధికి ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తున్న ఎంఎల్సి కవితకి, శాసన సభ్యులు షకీల్ ఆమెర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కండే సవిత సంజీవ్, ఉప సర్పంచ్ సరిడే సాయిలు, వార్డు మెంబర్ రాజు, ...
Read More »పీడితుల పక్షాన కలమెత్తిన వ్యక్తి మొయినుద్దీన్
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెలంగాణ జాగృతి నిజామాబాద్ ఆద్వర్యంలో మొయినుద్దిన్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4న జన్మించారని, తాను కమ్యూనిస్టు ఉద్యమానికి జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రగతిశీల బావాలతో పీడీతుల పక్షాన కలమెత్తి, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ ఆపర్ణ, జిల్లా కో కన్వీనర్ పులి జైపాల్, జిల్లా అధికార ...
Read More »కస్తూర్బా హాస్టల్లో హెల్త్ క్యాంప్
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామరెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల కస్తూర్భా హాస్టల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు డాక్టర్ షాహీద్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థినిలకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారికి కరోన వ్యాధిపై పలు సూచనలు చేశారు. క్యాంప్లో వైద్య సిబ్బంది భీమ్, దోమల శ్రీధర్, శ్రీహరి, కస్తూర్బా ప్రిన్సిపాల్ వనిత, టీచర్లు కరుణ, రజిత, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read More »ఓటిపి తప్పనిసరి కాదు
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ సరుకులు తీసుకునే లబ్దిదారులకు ఐరిష్ ద్వారా సరుకులు అందించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఐరిష్ రాకుంటేనే ఓటిపి చూడాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను, రేషన్ డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి సెల్ కాన్ఫరెన్సు ద్వారా సివిల్ సప్లై, ఆర్డివోలు, తహసిల్దార్లతో రేషన్ పంపిణీ పై స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బయోమెట్రిక్ ద్వారా రేషన్ పంపిణీతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశమున్నందున ఇతరత్రా ...
Read More »