నిజామాబాద్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు మే చివరికల్లా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరములో సిడిపి, ఎస్డిపి, ఎంపి లాడ్స్, రెండు పడక గదుల ఇళ్ళు, ఇతర నిర్మాణ పనులపై పి ఆర్., ఆర్అండ్బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్ మార్చ్ 31 వరకు బిల్స్ రికార్డు చేయాలన్నారు. మే 31 తేదీ వరకు అన్ని వర్క్స్ పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీ హాల్స్, మహిళా భవనాలు, కల్యాణ మంటపాలు, ఇతర ఆన్ గోయింగ్ వర్క్స్ స్పీడప్ చేయాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇది వర్కింగ్ సీజన్ కాబట్టి వేగంగా జరిగే విధంగా చూడాలన్నారు.
ప్రోగ్రెస్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలని, ప్రారంభం కానివి వెంటనే స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి వర్క్స్ నిబంధనల ప్రకారంగా ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సిసి, మురుగు కాలువల పనులు జరుగుతున్న చోట వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఎస్.ఇ. ఆర్అండ్బి రాజేశ్వర్ రెడ్డి, సిపివో శ్రీ రాములు, పంచాయతీ రాజ్ డిఇ లు, ఏఇ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021