నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు నోటిఫై చేయబడి డ్రా వాయిదా పడిన 11 బార్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది.
1.నిజామాబాద్ కార్పొరేషన్ 7 బార్లకు గాను 23 దరఖాస్తులు
2. ఆర్మూరు మున్సిపాలిటీ 1 బార్లకు గాను 16 దరఖాస్తులు
3. బోధన్ మున్సిపాలిటీ 3 బార్లకు గాను 9 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు.
ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి కార్యాలయం, సుభాష్ నగర్, నిజామాబాద్ యందు డ్రా తీయడం జరుగుతుందన్నారు. కావున దరఖాస్తుదారులు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి కార్యాలయం నందు ఉదయం 9 గంటల సమయానికి రిపోర్టు చేయాలని సూచించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021