కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉండగా కామారెడ్డి జిల్లా రక్త దాతల వాట్సప్ నిర్వహకుడు గడ్డం నరేష్కు పేషంట్ కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్త దాతల వాట్సప్ గ్రూప్ వ్యవస్థాపకులు, బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనుగందుల నవీన్ సేవ దృక్పథంతో ముందుకు వచ్చి బి పాజిటివ్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వేసవి కాలంలో రక్త లేమితో చాలా మంది మహిళలు, వృద్దులు బాధపడుతుంటారని, చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుంది కాబట్టి యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని కోరారు.
రక్తదాన కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా కార్యదర్శి బొనగిరి శివ, బిజెవైఎం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు నంది వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్, పట్టణ కార్యదర్శి శరణ్, బీజేపీ నాయకులు నరేష్, శ్రీకాంత్, రాజు విటి టాగూర్ రక్తనిధి కేంద్రం నిర్వహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021