కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి వడ్లు మర పట్టించడం (మిల్లింగ్) ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. మిల్లింగ్ చేయడంలో అలసత్వం ప్రదర్శించే రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లింగ్ పూర్తి కాకపోతే సంబంధిత ఉప తహసిల్దారుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో డీఎస్ఓ కొండలరావు, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, రైస్ మిల్లుల యజమానులు ...
Read More »ఫిబ్రవరి 3 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 3 లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టెలీ కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో పంటల నమోదు ప్రక్రియను సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే క్రాప్ బుకింగ్ జరిగిందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి గుంటలో వేసిన పంటలను నమోదు చేయాలని ఆదేశించారు. రైతు బంధు సమితి సభ్యులతో ...
Read More »జిల్లాలో నాలుగు కొత్త బార్లు
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నాలుగు కొత్త బార్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి రెండు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి చొప్పున మొత్తం నాలుగు కొత్త బార్ల కోసం ఈనెల 25 వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు ఆఫీసు పని దినములలో దరఖాస్తులు స్వీకరించడం ...
Read More »గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనలతో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలని, మాస్కు లేనివారికి జిల్లా వైద్యశాఖ కోవిడ్ హెల్ప్ డెస్క్ ద్వారా అందివ్వాలని ప్రతి ఒక్కరూ శానిటైజర్ తప్పక వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కుర్చీలు దూరంగా ...
Read More »ప్రజాస్వామ్య పటిష్టానికి కంకణబద్ధులం కావాలి
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న ప్రజాస్వామ్యం మనదని దాని పటిష్టానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ముందుకు వెళ్లాల్సి ఉందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ...
Read More »అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముందుగా నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడను, పాత అంగడి బజారులో నిర్మిస్తున్న నూతన చేపల మార్కెట్ను పరిశీలించారు. పనులు త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎర్రమన్ను కుచ్చ కాలనీలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను ...
Read More »టెట్ పై అవగాహన
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కర్షక బిఎడ్ కళాశాలలో ఆదివారం అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టెట్ ఉచిత డెమో తరగతులు నిర్వహించారు. టెట్ ఉచిత కోచింగ్కు అభ్యర్థులు హాజరయ్యారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు టిఎన్ఎస్ఎఫ్ ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుందని, కామారెడ్డి పట్టణ విద్యార్థులకు ఉచితంగా అవనిగడ్డ అధ్యాపకులచే తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. దీనిని నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే నోటిఫికేషన్లకు విద్యార్థిని విద్యార్థులందరు ...
Read More »హరిదా సేవలు అభినందనీయం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం చేస్తున్న సాహిత్య సేవలు అభినందనీయమని, నూతన సంవత్సరంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటే మరిన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హరిదా రచయితల సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్, దశరథ్ కొత్మీర్కర్, గోశిక నరసింహ స్వామి, గుత్ప ప్రసాద్, మూడ్ కిషన్, ...
Read More »బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ దివస్గా పాటిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం సాధించడంలో సాయుధ ఆర్మీ ద్వారా విశేష కషి చేశారని చెప్పారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ ...
Read More »ఈనెల 25 నుండి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సిన్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రైవేటు హెల్త్ కేర్ వారియర్స్కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు కోవీడు వ్యాక్సినేషన్పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25 నుండి ఒక్కో కేంద్రంలో 100 ...
Read More »విజయ డైరీ 30 శాతం రాయితీ ఇస్తుంది
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ యువత ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్ డెమో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతలు, జాతర్లు జరిగే చోట వాహనంపై పాల పదార్థాలు తీసుకెళ్లి విక్రయించు కోవాలని సూచించారు. బ్యాటరీతో ఆటో నడుస్తుందని, 10 గంటల పాటు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలపాటు ఈ కార్ట్ పనిచేస్తోందని తెలిపారు. వాహనం ధర ...
Read More »24 గంటల పాటు నడిపించి లక్ష్యాలు పూర్తి చేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 28 లోగా రైస్ మిల్లుల యజమానులు వడ్లను మర పట్టించడం (మిల్లింగ్) ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రైస్ మిల్లు యజమానులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రైస్ మిలర్లతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. యాసంగి మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లులను 24 గంటలపాటు నడిపించి లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. టెలీ కాన్ఫరెన్సులో ...
Read More »బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 కి ఎంపిక చేయబడ్డారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ జారీచేసిన జాబితాలో ఆయన రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ముగ్గురు అధికారులలో ఒకరిగా ఎంపిక చేయబడ్డారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందించే అవార్డుల జాబితాను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. నిజామాబాద్ అర్బన్కు చెందిన ఖనీజ్ ఫాతిమా బెస్ట్ బిఎల్ఇగా అవార్డుకు ఎంపికయ్యారు.
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ, ఎం.ఎడ్., పీజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి శనివారం కూడా ప్రశాంతంగా జరిగాయి. కాగా డిగ్రీ పరీక్షా కేంద్రాల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు సమాచారం అందింది. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 275 నమోదు చేసుకోగా 230 హాజరు, 40 గైర్హాజర్ అయ్యారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎం.ఎడ్. నాల్గవ ...
Read More »కార్మికులు విధులు తనిఖీ చేసిన మేయర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నగరంలోని గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద గల మున్సిపల్ జోన్ 2 కార్యాలయన్ని ఉదయం 5 గంటలకు నగర మేయర్ నీతూ కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి కార్మికులు విధులకు సకాలంలో హాజరు కావాలని విధులను సక్రమంగా నిర్వర్తించి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికులకు అందించిన గ్లౌస్లు, షూస్, మాస్కులు ధరించి జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ...
Read More »ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎంకు లేఖ
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని అలాగే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ఉపకులపతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసి దానిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేశారు. అనంతరం వేణు రాజ్ మాట్లాడుతూ కెసిఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అలాంటిది ...
Read More »గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26న నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సింపుల్గా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పుడూ నిర్వహించుకునే సమయానికే వారి కార్యాలయాలలో చేసుకున్న తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్కు జిల్లా అధికారులు, సిబ్బంది హాజరుకావాలని తెలిపారు. ఈ ...
Read More »ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొద్దిపాటి చర్యలవల్ల యాక్సిడెంట్లు తగ్గించగలుగుతామంటే అంతకన్నా సంతోషం ఏమీ లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడానికి చిన్నపాటి ఏర్పాట్లతో కొంత ఖర్చుతో చర్యలు తీసుకోవడం వల్ల లైఫ్ సేపు అవుతుందనీ, బ్లాక్ స్పాట్స్ జాయింట్ ...
Read More »అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు గౌండింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లతో గొర్రెల యూనిట్ల గౌండింగ్ పై సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే 75 శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జగన్నాధచారి పాల్గొన్నారు.
Read More »సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో గజానాన్ పటేల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక అయినందుకు కామారెడ్డి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కలిసి జిల్లా యువజన అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానీ మీరు మమ్మల్ని సంప్రదించకుండా స్వయంగా మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఒంటెద్దు పోకడలకు ...
Read More »