నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, పలువురు అధికారులు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ...
Read More »రుద్రూర్లో శాంతి కమిటీ సమావేశం
వర్ని, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి ఎస్హెచ్వో రుద్రూర్ ఆధ్వర్యంలో మండలంలోని ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Read More »కోటగిరిలో కోవిడ్ నిబంధనలపై అవగాహన
బాన్సువాడ, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, బస్టాండు, మార్కెట్, బిసి కాలనీ, వినాయక్ నగర్లో ప్రజలకు, దుకాణ యాజమానులకు ‘‘కోవిడ్ 19’’ నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు అందరు మాస్క్ తప్పకుండా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని, సానీటైజర్ వాడాలని సూచించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని, ఎవరికైనా కరోన ...
Read More »మాక్లూర్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవీడ్ లక్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్లోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించి కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాలపై లక్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ...
Read More »నిరుద్యోగులను ఆదుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని కారణంగా ఇటీవల ప్రైవేట్ టీచర్లు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వేములవాడ, నాగార్జునసాగర్లో భార్య భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కుడా లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, చనిపోయిన రవి ఇద్దరు పిల్లల భవిష్యత్ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, పిల్లల పేర్ల మీద 10 ...
Read More »పెంచిన ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి
మోర్తాడ్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఏఐకెఎమ్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం రైతులకు అవసరమయ్యే ఎరువులపై రెండు నెలల ముందుగానే ఇష్టానుసారంగా ధరలు పెంచడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే వ్యవసాయ సీజన్కు ముందుగానే ఎరువుల ధరలు ప్రస్తుతం ఉన్న ...
Read More »దేగాంలో వ్యాక్సినేషన్ అభియాన్
ఆర్మూర్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోన వ్యాక్సినేషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో కరోన వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్, బిస్కేట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షు రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోన రెండవ దశ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఉన్న మార్గాలు ఒకటి వ్యాక్సిన్ వేయించుకోవడం, రెండవది మాస్క్ ...
Read More »ప్రభుత్వ విప్ సమక్షంలో తెరాసలో చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ శ్యామయ్యతో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో తెరాస కండువాలు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరేందుకు ఇష్టపడినట్టు వారు చెప్పారు. వారికి గులాబి కండువాలు కప్పి గంప గోవర్ధన్ పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 13 లక్షల 86 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 608 మందికి 3 కోట్ల 96 లక్షల 64 వేల 300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, ...
Read More »కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది
మోర్తాడ్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం ఆయా గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కలిపి 46 మందికి కరోనా వ్యాక్సిన్ చేయడం జరిగిందని మోర్తాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.
Read More »కోవిడ్ కేర్ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో కోవిడ్ కేర్ కేంద్రాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్లో వంద పడకల స్థాయికి, ఆర్మూర్, బోధన్లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాలనీ, అంబులెన్స్ ...
Read More »ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ సినిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కంట్రోల్ రూమ్ అధికారులు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. 08468-220051 నెంబరుతో ఏడు క్లస్టర్ పాయింట్లతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్లో ఏ రోజు ఎంత మంది రైతుల నుండి ...
Read More »సిబ్బంది వివరాలు సేకరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలను మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓలతో, మున్సిపల్ కమీషనర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు ...
Read More »కోవిడ్ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ సెకండ్ వేవ్ మరియు వాక్సినేషన్పై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్ ను ...
Read More »టీకాతోనే రక్షణ
మోర్తాడ్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు టీకా తీసుకొని కోవీడు మహమ్మారిని తరిమివేయాలని మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. టీకా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలన్నారు. టీకాతో ప్రాణానికి వంద శాతం మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ప్రజలందరూ మాస్కు ధరిస్తే లాక్ డౌన్తో సమానమేనని ఎస్ఐ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా గుంపులుగుంపులుగా ఉండరాదని సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు ...
Read More »ఘనంగా ఎన్.ఎస్.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ నగరం కాంగ్రెస్ భవన్లో ఎన్.ఎస్. యూ.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి హాజరై ఎన్.ఎస్.యూ.ఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడే తత్వం మరియు నాయకత్వ లక్షణాన్ని పెంపొందించి ...
Read More »జాగ్రఫీలో డాక్టరేట్ పొందిన నారాయణ
డిచ్పల్లి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సౌత్ క్యాంపస్లో జియో-ఇన్ ఫర్మాటిక్స్ విభాగం అకడమిక్ కన్సల్టెంట్ ఎస్.నారాయణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాగ్రఫీ సబ్జెక్ట్ లో పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జాగ్రఫీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసిన విశ్రాంతాచార్యులు డా. కె. నారాయణ పర్యవేక్షణలో ‘‘అర్బన్ స్ప్రాల్ అనాసిస్ ఆఫ్ నిజామాబాద్ టౌన్ త్రూ జిఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన ...
Read More »మహమ్మారి నిర్మూలనకు మన జాగ్రత్తలే ప్రధానం
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు శాఖ తీసుకోవలసిన చర్యల గురించి శుక్రవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్ వీడియో కాన్స్ రెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ నివారణకు గానూ ప్రతి ఒక్కరు మాన్క్ ధరించడం అత్యంత ప్రధానమని ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. పోలీసు సిబ్బంది స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించడం కుటుంబ సభ్యుల పట్ల ...
Read More »15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల వివరాలు అందించండి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆదుకుంటుందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం బీఆర్కె భవన్ నుండి ఆమె పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల శాఖ డిసిఎస్వోు, డిఎంతో వీడియో కాన్ఫరెన్స్ ...
Read More »ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి గుడ్న్యూస్
హైదరాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాలల సిబ్బందికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ.2 వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్ అకౌంట్ ...
Read More »