ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై గరమైతున్నారు ఆర్యవైశ్యులు. ఆయన రాసిన.. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు పుస్తకం తమను కించపరిచెటట్టు ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు ఆర్యవైశ్యులు. ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెట్టారు. ఆయన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో.. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాల ఆర్యవైశ్యులు నిరసనకు దిగారు. కించపరిచేలా కంచె ఐలయ్య పుస్తకం రాశారని ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యులను స్మగ్లర్లు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో.. కంచె ఐలయ్య రాసిన ...
Read More »స్పెయిన్పై పంజా విసిరిన ఉగ్రభూతం
ఉగ్రవాదం మరోసారి పంజా విసిరింది. ఈసారి స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై వాహనంతో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంలో పధ్నాలుగు మంది మృతి చెందగా, మరో 50మంది వరకూ క్షతగాత్రులయ్యారు. ఇందులో పదహారు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి. గురువారం బార్సిలోనాలోని లస్రంబ్లస్ రహదారిలో రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్రల పైకి ఒక వ్యానుతో ఉగ్ర వాదులు దూసుకువెళ్లి ఈ మారణ హోమాన్ని సృష్టిం చారు. ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతిచెందినట్లు ...
Read More »ఖతార్ సంక్షోభానికి మోక్షం ఏదీ?
Qatar issue గల్ఫ్ మండలిలోని అతిచిన్న దేశమైన ఖతార్పై ఇతర అరబ్దేశాలు విధించిన ఆంక్షలతో ఇతర దేశీయులకు ముఖ్యంగా భారతీయులకు పాట్లు ఎక్కువయ్యాయి. అక్కడి వీసాలపై పనిచేసేందు కువచ్చినవారికి ఇతర గల్ఫ్దేశాల్లో పనులు ఉపాధి లభిం చడంలేదు. ఆర్ధికపరంగా ఆంక్షలు విధిస్తూ ఖతార్ను ఏ కాకినిచేసే విధంగా గల్ఫ్దేశాలు ఒక్కటయ్యాయి. విమా నాలు రద్దయ్యాయి. మరికొన్నింటికి రూట్లు మార్చివేసా రు. ఖతార్ పౌరులపై ఇతర గల్ఫ్దేశాల్లో బహిష్కరణ వేటు విధించారు.ఇదంతా ఎందుకు ఉగ్రవాదానికి ప్రత్యే కించి ఐసిస్, ఆల్ఖైదా వంటి సంస్థలకు ఖతార్ మద్దతు ...
Read More »తగ్గుతున్న నల్లకుబేరుల స్విస్ సంపద!
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోప్రత్యేక పర్యవేక్షణ ఫలితమోలేక సుప్రీం ఉత్తర్వులను అనుసరిం చి సిట్ ఏర్పాటుచేయడంద్వారా నల్లధనంపై అలుపెర గని పోరువల్లనైతేనేమి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటు న్న నల్లధనం నిల్వలు తగ్గుతున్నాయనే చెప్పాలి. భార తీయులు స్విస్బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము గత ఏడా దితో పోలిస్తే భారీగా తగ్గిందని స్వయంగా స్విస్ నేష నల్ బ్యాంకు వెల్లడించింది. కొందరు పన్నుల ఎగవేత ద్వారా రూటుమార్చి బ్యాంకుల్లో భద్రపరుచుకుంటుంటే మరికొందరు గుప్తధనంపై లెక్కలు చెప్పడం, ఆపై పన్ను లభారంతో సతమతం కాలేక అక్రమమార్గాల్లో ఇతర విదేశీ బ్యాంకులకు మళ్లిస్తున్నారు. ...
Read More »ఐటి రంగానికి శ్వేతసౌధం భేటీ నిరాశ!
భారత్ అమెరికాలమధ్య అడ్డుగోడగా నిలిచిన వీసా ఆంక్షల ప్రభావం ప్రధానిమోడీ అమెరికా పర్యటనతో స్పష్టత వస్తుందని భావించిన భారత్ ఐటి రంగానికి సందిగ్ధత ఇంకా వీడలేదు. వాణిజ్యం, పెట్టుబ డులే ప్రధానాంశాలుగా నడిచిన శ్వేతసౌధం భేటీలో డొనాల్డ్ ట్రంప్ మరింతగా ఆర్ధికలోటును తగ్గించాలన్న సూచనలు మాత్రం అందాయి.నవీన భారతావనికి మోడీ కృషి చేస్తున్నట్లుగానే మరింత గొప్పదేశంగా అమెరికాను తీర్చిదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చేస్తు న్న కృషి ఎల్లలు లేనిదన్న మోడీ పొగడ్తలకే పరిమితం అయిందన్న విశ్లేషణలు వచ్చాయి.న్యూయార్క్ జర్నల్లో మోడీ సంపాదకీయం కూడా ...
Read More »ప్రేమా నీకో నమస్కారం
ప్రేమ జంటల మద్య విభేదాలు పెటాకులవుతున్న ప్రేమ పెళ్లిళ్లు పరస్పర నమ్మకం కోల్పోవడంతో స్పర్థలు తల్లిదండ్రుల సహకారం లేక ఇబ్బందులు పెళ్లయిన ఏడాదికే విడిపోతున్న జంటలు పీకల్లోతు ప్రేమలో పడతారు. కుల,మత, ప్రాంత, ఆర్థిక భేదాలను అస్సలు పట్టించుకోరు. ఒకరికొకరం ఉంటే చాలనుకుంటారు. పెద్దలను ఎదిరిస్తారు. ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తారు. పోలీసుల సమక్షంలో దండలు మార్చుకుంటారు. ప్రేమికులు కాస్తా దంపతులయ్యాక అలకలు, అనుమానాలు, ఆగ్రహాలు పొడసూపుతాయి. ఏడాది తిరగకముందే ప్రేమ పెళ్లి .. పెటాకులకు దారితీస్తోంది. కన్నవారికి కాదనుకుని పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటల ...
Read More »ఉరుముతున్న ఉగ్రభూతం!
మారణహోమం సృష్టిం చేందుకు వాహనాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నా రు. ఇప్పుడు లండన్లో జరిగిన దాడి కూడా వాహనం తోవచ్చి ప్రజలను ఢీకొట్టి ఆతర్వాత విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేందుకు ప్రయత్నం చేశారు. మొదట థేమ్స్ నదీపై ఉన్న లండన్ వంతెనపై వ్యాన్తో పాదచారులను ఢీకొట్టి అక్కడి నుంచి దిగువనున్న బరో మార్కెట్ ప్రాంతానికి దూసుకువెళ్లారు. అక్కడ రైలింగ్ను ఢీ కొట్టి వ్యాన్లోనుంచి బయటకు దూకిన ముగ్గురు ఉగ్రవాదులు మార్కెట్ ప్రాంతంలో ఉన్న అమాయకు లపై విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. ఇక్కడా అక్కడా అనిలేదు. మోహం, ...
Read More »ధరల పాపం తలాపిడికెడు
ఒకపక్క అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలు మరొకపక్క పొగమంచులా విస్తరిస్తు న్న కల్తీతో బీదాబిక్కితోపాటు సామాన్యులు విలవిలలాడి పోతున్నారు. గత రెండుమూడేళ్లగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగానే పడుతున్నాయి. ముఖ్యంగా గత ఖరీఫ్,రబీల్లో దిగుబడులు కూడా ఊహించని విధంగా పెరిగాయి. వరిధాన్యం ఉత్పత్తులే కాదు పప్పుదినుసుల తోపాటు మిర్చి లాంటి వాణిజ్య పంటలు కూడా బాగానే పండాయి. కానీ అవి సామాన్యు డికి అందుబాటులో లేకుండా కొండెక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరల ను నియంత్రించడంలో అధికారులు విఫలమవ్ఞతున్నా రని చెప్పకతప్పదు. ...
Read More »సయోధ్య సాధ్యమేనా?
ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ అత్యధికస్థానాలు సాధించి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో అయోధ్య అంశంలో ఏదో ఒక కదలిక తప్పదని అనుకున్నదే. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధినాయకులంతా బహిరంగ సభల్లో రాముడికి జైకొడుతూ, ఆలయ నిర్మాణం జరగాలంటే తమకు అద్భుత మెజారిటీ దక్కాల్సిందేనని ప్రజలకు గుర్తుచేశారు. ప్రధానితో ఒక్క వేదికనూ పంచుకోని యోగి ఆదిత్యనాథ్, తన ప్రచార సభల్లో రామమందిర నిర్మాణం ఖాయమని హామీ ఇస్తూ వచ్చారు. ‘నిర్మాణాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా?’ అని సవాలు చేశారు. ‘మసీదు కూల్చివేతనే ...
Read More »కల్తీని అరికట్టే నాధుడేడీ?
కల్తీని అరికట్టేవిషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదు.కల్తీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటా మని కల్తీదారులపై అవసరమైతే పీడి చట్టాన్ని కూడా ప్రయోగించి కటకటాల వెనక్కి పంపుతామని పదేపదే ప్రకటిస్తున్నా కల్తీమాత్రంఅంతకంతకు విజృంభించిపోతు న్నది. తాగే నీటిలో కల్తీ. ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంలో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఎరువ్ఞల్లో కల్తీ, చివరకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడే అత్య వసర మందుల్లో కల్తీ.అదీఇదీ అని లేకుండా మొత్తం కల్తీ మయమైపోతున్నది.రానురాను కల్తీతోమనిషి మనుగడకే ...
Read More »కొరియా దూకుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఏం చేస్తారా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తరకొరియా పాలకుడి మాదిరిగానే ఈయనకూ కావాల్సినంత తిక్క, దూకుడు ఉన్నాయి. సోమవారం ఉదయాన్నే ఉత్తరకొరియా ప్రయోగించిన నాలుగు ఖండాంతర క్షిపణుల్లో మూడు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ అధీనంలోని సముద్రప్రాంతంలో వచ్చిపడ్డాయి. ఒకేమారు ప్రయోగించిన ఈ మిసైళ్ళు జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజడ్)లోకి వచ్చిపడటం తనదేశానికి తీవ్రంగా హెచ్చిన విపత్తుకు సంకేతమని జపాన్ వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాగానే ఉత్తరకొరియా గతంలో ఒక మిసైల్ను ప్రయోగించి ఆయనకు స్వాగతం పలికింది. ...
Read More »ఇస్లామిక్ స్టేట్ ‘ఉగ్ర’మూలాలు కదులుతున్నాయా?
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా అండ్ ఇరాక్(ఐసిస్) మూ లాలు కదులుతున్నాయా? ప్రత్యేకించి ఇరాక్ నిర్వహిస్తున్న నిరంతర దాడులతో ఐసిస్ శిబిరాలు మారుతున్నాయా? ఇటీవలి ఐసిస్ అధిపతి అబూబాకర్ బాగ్దాది ప్రసంగంగా చెపుతూ టివి ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ప్రకటన ఇందుకు ఊతంఇస్తోంది.ఇరాక్లో పతన మయ్యామని, ఘోరపరాజయం తప్పదని తనకార్యకర్తల ను దళాలను హెచ్చరించడంతోపాటు పారిపొమ్మన్నారు. లేదా అష్టదిగ్బంధనం జరిగితేపేల్చుకుని చచ్చి పోవాలం టూ మార్గనిర్దేశనం చేయడం ఐసిసిప్రాబల్యం తగ్గిపోతు న్నదన్న సంకేతాలిస్తోంది. ఐసిసిఉగ్రవాద మూలాలు ఇరాక్, సిరియాలనుంచి ప్రపంచ ...
Read More »తప్పని మార్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగం అనేకులకు నచ్చింది. ఆయన మారిన మనిషని అనేకులు తీర్మానించారు. కనీసం ఈ ఒక్కరోజైనా ఆయనలో మార్పు కనిపించిందని మరికొందరు అనుకున్నారు. అధ్యక్షప్రసంగం అనంతరం మీడియా సంస్థలు చేసిన సర్వేలో ప్రతి పదిమంది అమెరికన్లలో ఏడుగురు తమకు ఆయన ప్రసంగం తెగనచ్చేసిందని చెప్పారట. ప్రసంగ మొదట్లోనే ఆయన కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను ఖండించడమూ, అమెరికన్ కాంగ్రెస్ రెండు నిముషాలు మౌనం పాటించడం విశేషం. శ్రీనివాస్ హత్య విద్వేషపూరితమైనదనీ, ఇది జాతివివక్ష హత్యేనని ...
Read More »ట్రంప్కు మీడియా ఫోబియా!
దీనివల్ల ఉపాధి పెరుగుతుందని ట్రంప్ పాలకవర్గం వాదనగా ఉంది. ఇక తాజాగా మరోసారి మీడియాను శత్రువుగా భావిస్తూ ట్రంప్ మరోసారి వివాదాల్లోకి వ చ్చారు. అమెరికా ప్రజల శత్రువు మీడియా అన్న వ్యాఖ్య లు ట్విట్టర్లో పొందుపరచడం ద్వారా మరోసారి వార్తల కక్కారు. ఫ్లోరిడాలోని మారాలోగోలో విశ్రాంతి తీసుకుం టున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. వరుసగా మూడోవారాంతంలో ట్రంప్ తన విశ్రాంతి దినాలను గడుపుతున్న సందర్భంలో 140అక్షరాలతోకూడిన ట్విట్ట ర్ వ్యాఖ్యలో అమెరికా ప్రజల ప్రధాన శత్రువు మీడియా అని వ్యాఖ్యానించడం పెద్ద ...
Read More »జాతివివక్షలా? జాత్యహంకారమా?
US అగ్రరాజ్యంలో జాతివివక్షకు బీజం పడిందా? కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చేపట్టిన విధివిధానాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నా యా?కేవలం అమెరికాఫస్ట్ నినాదంతో ముందుకుపో తున్న ట్రంప్ చివరకు ఆదేశ మీడియాపై కూడా నిషే ధాజ్ఞలు విధించేవరకూ వెళ్లారంటే తన పదవీకాలంలో ఏంచేసినా సహించాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది. పైగా అమెరికా ఫస్ట్ ముసుగులో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యేకించి భారతీయులకే చేటుతెచ్చేవిగా ఉన్నాయి. ఈ విధానాలను వ్యతిరేకించిన వారిని బ్లాక్ లిస్ట్లో పడేయడం ట్రంప్ పాలకవర్గానికి కొత్తేమీ కాదు. గతంలో కూడా అమెరికా అధ్యక్షులు కొందరు ...
Read More »వరకట్నాగ్నికి వధువులు సమిధలా!
పెళ్లిఅయిన కొద్ది రోజుల్లోనే వధువ్ఞ వంటింట్లో అగ్ని ప్రమాదానికి గురికావడం కొన్ని సంఘటనల్లో సజీవ దహనం కావడం,మరికొన్ని సంఘటనల్లో తీవ్రంగా గాయపడడం, ఆ తర్వాత ఆస్పత్రిలో మృతిచెందడం ఈ సంఘ టనలపై అనుమానాలు ఈవిధంగా దేశంలో ఎన్నో అనుమానాస్పద మరణాలు వధువ్ఞల పాలిట కన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ మరణాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇవన్నీ కూడా గృహహింస కింద,వరకట్నం చావులకింద చివరకు నిర్ధారణ అవ్ఞతు న్నాయి. భర్త, అత్తమామల వల్ల వేధింపులకు గురి కావడం, ఆ తర్వాత హత్యకు దారితీయడం ...
Read More »సొంతగడ్డపైనే ట్రంప్కు చిక్కులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ జారీచేసిన ఫర్మానాపై స్వదేశంలోని న్యాయవ్యవస్థలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ట్రంప్ జారీ చేసిన ముస్లిందేశాల శరణార్ధుల తాత్కాలిక నిషేధం ఉత్తర్వులు చెల్లవని పేర్కొంటూ అప్పీల్స్కోర్టును ఆశ్రయించిన 16 మంది అటార్ని జనరల్స్ తాజా సవాలు అమెరికాలోనే కాదు ప్రపంచదేశాల్లో చర్చనీయాంశమైంది. అయినా వెనక్కి తగ్గేదిలేదని, న్యాయస్థానాల్లో కూడా పోరాడతా మని శ్వేతసౌధం ట్రంప్కు వత్తాసుపలుకుతోంది. రాజ్యాంగం ఆయనవైపే ఉందని, దేశప్రజల ప్రయోజ నాలను కాపాడేందుకు ఏంచేయాలి,ఏమిచేయకూడదనే అంశంలో అధ్యక్షునికి పూర్తిస్పష్టత ఉందని,చట్టం పూర్తి గా అధ్యక్షునివైపే ఉందని శ్వేతసౌధం ప్రతినిధివర్గం వెన కేసుకురావడాన్ని ...
Read More »‘ట్రంప్ ఆంక్షల లక్ష్యం ఎటువైపు?
అగ్రరాజ్యం కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్ట్రంప్ ప్ర వేశపెట్టిన విధానాలు మొత్తం ప్రపంచ దేశా లకు కలవరం పుట్టిస్తున్నాయి. హెచ్వన్బి వీసాలపై ఆంక్షలు ప్రవేశపెట్టి, ఏడు ముస్లిందేశాలనుంచి వచ్చే శరణార్ధులపై 190 రోజుల నిషేధం ప్రకటించిన వెంటనే అమెరికా వీసా అధికార యంత్రాంగం సుమారు లక్షకుపైగా వీసాలను రద్దుచేసింది. ఏడు ముస్లిం దేశా లపైనే ప్రధానంగా లక్ష్యంపెట్టుకుని డొనాల్డ్ట్రంప్ పాలనా యంత్రాంగం ఈ నిషేధాజ్ఞలు జారీచేసింది.ఒక్క 2015లోనే 11 మిలియన్లకుపైగా వలస, వలసేతర వీసాలను జారీచేసిన అమెరికా ఈసారి ఏడు ముస్లిం దేశాలతోపాటు ఇతర దేశాల ...
Read More »ఇంకెన్నేళ్లీ పేదరికం?
Poverty సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించి అరవైఏడు సంవత్సరాలు పూర్తిఅయ్యాయి. నేడు అరవై ఎనిమిదోవ రిపబ్లిక్ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణం. ఇన్నే ళ్లు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రధానంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. లక్షలాది కోట్లరూపాయల ప్రజాధనాన్ని వెచ్చిం చారు.కోట్లాది రూపాయల సబ్సిడీ అందించారు. అర్థా కలితో అల్లాడుతున్న నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.ఇప్పటికీ ఈ కార్యక్రమాలు నిరంతరంగానే జరుగుతున్నాయి.కానీ ఆశించిన మేరకు ఫలితాలు అంద డంలేదు.ఎవరికోసమైతే ఈ పథకాలు ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలు ...
Read More »ట్రంప్ శకం ఆరంభం!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ శకం ప్రారంభమైంది. ప్రపంచదేశాలను శాసిం చే అగ్రరాజ్యం 45వ అధ్యక్షుడిగా వాణిజ్య సామ్రాజ్యం నుంచి వచ్చిన ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. నా ప్ర యాణం ఆరంభిస్తున్నాను. అమెరికా ప్రజలకోసం ఈ ప్ర యాణం మరింత గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆదిశగా మరింతకృషిచేస్తా. అందులో ఎలాంటి సందేహా లులేవు. అందరంకలిసి అమెరికానుమరోసారి మరోసారి గొప్పదేశంగానే కొనసాగిద్దాం అంటూ ట్రంప్ తన తొలి వ్యాఖ్యలుచేసి ప్రమాణస్వీకారానికి సన్నాహక కార్యాచర ణ ఆరంభించారు. ప్రపంచవ్యాప్తంగాఎంతోఆసక్తితో తిల కించనున్న డొనాల్డ్ట్రంప్ ప్రమాణస్వీకారానికి సుమారు 9లక్షలమందివరకూ ...
Read More »