నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ షాకిర్ అలీ తన సిబ్బందితో కలిసి 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో స్మార్ట్ లైఫ్ పేరు మీద లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 4వ టౌన్ పరిధిలో అక్షర ఏజెన్సీ పేరుతో లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు ...
Read More »భారీగా నిషేదిత పొగాకు స్వాధీనం
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ నరేందర్, షాకీర్ అలీ, సిబ్బంది కలసి టౌన్ పిఎస్ పరిధిలో నిషేధిత గుట్కా, తయారీ కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత పొగాకు సంచులు 175, లతీఫ్ లేబుల్ గుట్కా బ్యాగులు 43 సీజ్ చేశారు. గుట్కా ఫ్యాక్టరీ మెషిన్ – 5, తంబాకు బ్యాగులు -32, తంబాకు కెమికల్ లిక్విడ్ డ్రమ్ములు – 3, గుట్కా ...
Read More »పెట్రోల్ బంకుల్లో హైటెక్ మోసం
కామారెడ్డి బడా వ్యాపారే సూత్రధారి… కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యాధునిక టెక్నాలజి అందుబాటులోకి రావడంతో అనేక రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. కాగా పెట్రోల్ బంకుల్లో మోసాలు కొత్తేం కాకపోయినా ఇటీవల ఎక్కువయ్యాయి. పెట్రోల్ బంకుల్లో వాడే చిప్లో వాహనదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇవి జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ తక్కువ వచ్చి మీటర్ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్లు అమర్చినట్టు గుర్తించారు. ...
Read More »చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలపండి
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలపాలని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడిరచారు. నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజనల్ పరిధిలో ఎక్కడైనా గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్టు తెలిస్తే క్రింది నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి రివార్డు ఇస్తామన్నారు. ...
Read More »భారీగా ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, అదిలాబాద్ , నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నేరస్తున్ని పట్టుకున్నట్టు నిజామాబాద్ ఏసిపి వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో 5 వ టౌన్ ఎస్ఐ జాన్ రెడ్డి మరియు అతని సిబ్బంది కలిసి వర్ని ఎక్స్ రోడ్డు దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ఓ వ్యక్తిని వాహన కాగితాలు అడిగారు. సదరు వ్యక్తి డాక్యుమెంట్ల గురించి సరైన ...
Read More »డబ్బు కోసం హత్యలు
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 26 వ తేదీన బీడీ వర్కర్స్ కాలనీలో జరిగిన సుధాకర్, లక్ష్మయ్య జంట హత్యలకేసు విషయంలో నిందితులు బెజ్జంకి విఘ్నేష్ కుమార్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు. చెడు అలవాట్లకు బానిసైన విఘ్నేష్ డబ్బు కోసం హత్యలు చేసినట్టు వెల్లడిరచారు. విఘ్నేష్ తన వెంట షటిల్ బ్యాట్ కవర్లో తెచ్చిన గొడ్డలితో నరికి చంపినట్టు జిల్లా ఎస్పీ వెల్లడిరచారు. విఘ్నేష్కు గతంలో కామారెడ్డి ...
Read More »స్వామీజీ ఆత్మహత్య
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని రాములవారి గుడి వద్ద శ్రీ శాంతానంద తపోవన ఆశ్రమం దారానందగిరి స్వామిజీ అలియాస్ దూస సత్తయ్య అలియాస్ లచ్చయ్య సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. ఉదయం గుడి సిబ్బంది ఆహారం ఇవ్వడానికి పిలవడానికి వెళ్లారు. ధ్యానంలో ఉన్నాడని అనుకున్నారు. కాసేపు ఆగి లోపలికి వెళ్ళి చూస్తే ఉరివేసుకున్నట్టు కనబడిరదని మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేసు ...
Read More »రైతు ఆత్మహత్య
పెద్దపల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెడ్డిపల్లికి చెందిన మంద రాజి రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని, తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్వో గురు మూర్తి, స్వామి పేర్లు సూసైడ్ నోట్లో రాశాడు.
Read More »అంతిమ యాత్రలో ఆమెకు తోడుగా
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నా అన్న వారు ఎవరు లేక అంతిమ యాత్రకు నోచుకోని సంఘటన గురువారం కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో చోటు చేసుకుంది. చివరికి కొందరు తామున్నామని అండగా నిలిచి మానవత్వం బ్రతికే ఉందని చాటుకున్నారు. అంతిమ యాత్రకు కూడా నోచుకోలేక ఎందరో చివరికి మున్సిపాలిటీ పాలవుతున్న సంఘటనలు ఎన్నో. కామరెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసముంటున్న బాలామణి (60) గురువారం మృతి చెందింది. ఆమెకు కూతరు శ్రావణి తప్ప ఎవరు లేరు. బాలామణికి ...
Read More »తాగిన మైకంలో…
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More »రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంతాయిపేట్ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య, చిట్యాల గ్రామానికి చెందిన జంగం భూలక్ష్మి కామారెడ్డి డెంటల్ హాస్పిటల్ నుండి తిరిగి తమ ఎక్స్ఎల్ బండిమీద చిట్యాల గ్రామానికి బయల్దేరారు. తాడ్వాయి గ్రామం దాటినా తరువాత హనుమాన్ గుడివద్ద వెనకనుండి బ్లూ కలర్ ఎఫ్జెడ్ బైక్ మీద వచ్చిన వారు లక్ష్మి మెడనుండి పుస్తెల తాడు తెంపుకొని పారిపోయారు. బైక్ మీద వచ్చిన వారు ఒకరు మెరూన్ ...
Read More »వివాహిత ఆత్మహత్య
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవుని పల్లి గ్రామానికి చెందిన పుల్లన్నగారి నవ్య (29) వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకుని చనిపోయింది. కాగా మృతురాలి భర్త గత ఐదు సంవత్సరాల క్రితం మరణించాడు. గత నెల 16వ తేదీ ఆమె భర్త వర్ధంతి నుండి మానసికంగా కుంగిపోతూ, తల్లిదండ్రులకు భారమయ్యానని ఉరి వేసుకుని చనిపోయింది. వివాహితకు తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడు సంవత్సరాల బాబు ఉన్నారు. తండ్రి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు ...
Read More »భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో భర్త ఇంటి ఎదుట భార్య అందోళన చేసింది. మంగళవారం ఉదయం నుంచి బైఠాయించగా ఇంకా కొనసాగుతుంది. మామ సురేందర్ తాను చెప్పినట్లు వినాలని కోడలుపై వేధింపులు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా కొడుకు నవీన్కు రెండో వివాహం చేస్తామని, ఎమైనా చేసుకొండి అంటూ కోడలిపై మామ సురేందర్ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. కోడలుకు గర్భ సంచి లేదని భర్త నవీన్, మామ సురెందర్, అత్త సునీతలు, వివాహం ...
Read More »15 రోజుల వరకు అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దు…
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం అధికారులు చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. మేకల మందపై ఆదివారం రెండు చిరుతలు దాడి చేసి రెండు మేకలను కొరికి చంపడంతో పాటు మరో మూడు మేకలను తీవ్రంగా గాయ పరిచాయి. మాచారెడ్డి రేంజ్ అధికారి కిరణ్, డిప్యూటీ రేంజ్ అధికారిని సుజాత తమ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. గొర్రెల, మేకల కాపర్ల నుంచి వివరాలు అడిగి ...
Read More »అవినీతి అంతానికి కట్టుబడి ఉండాలి
నిజామాబాద్, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవినీతికి తావులేకుండా పనులు చేయించుకోవడానికి ప్రజలు కషిచేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 3 నుండి 9 వరకు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల ముగింపు రోజున సోమవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న చైతన్యం వల్ల కొంతమేరకు అవినీతి తగ్గిందని ఇది మరింత మెరుగు పడవలసిన అవసరముందన్నారు. ప్రజల్లో ...
Read More »ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ఆర్మూర్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో వ్యవసాయ కూలిగా పని చేసుకొనే మహారాష్ట్రకు చెందిన నాగనాథ్ (45) శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు చెరువులో పడి మతి చెందాడు. నాగనాథ్ బార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ఐ విజయ్ నారాయణ తెలిపారు.
Read More »100, 112 నెంబర్ల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన అత్యవసర సహాయ నంబర్ల పోస్టర్లను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్లో అదనపు పోలీస్ కమీషనర్ ఉషా విశ్వనాథ్ ఆవిష్కరించారు. 100, 112 నంబర్లతో కూడిన పోస్టర్లు ముద్రించడం వంటి అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా డిసిపి అన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ముద్రించిన పోస్టర్లను కళాశాలలు తదితర జనసమర్ద ప్రాంతాలలో అతికించడం ద్వారా అత్యవసర నంబర్ల ...
Read More »రోడ్డు ప్రమాదంలో ఏఈఓ మతి
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో లింగంపేట్ ఏఈఓ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలంలో ఏఈఓగా పనిచేస్తున్న ఖలీల్ అహ్మద్ గురువారం సాయంత్రం గాంధారి మండలం చందా నాయక్ తండా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన జేసీబీ సహాయంతో ఒక వ్యక్తి చెట్టును కూల్చివేయడానికి ప్రయత్నించడం, చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడడంతో దానిని తప్పుకోబోయి ...
Read More »దిశ లాంటి ఘటనలు జరగకుండా విస్తత అవగాహన
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శంషాబాద్ ప్రాంతంలో జరిగిన దిశ హత్యోదంతం లాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సంబంధిత అధికారులను కోరారు. గురువారం తన ఛాంబర్లో పోలీస్ కమిషనర్ కార్తికేయతో పాటు మహిళా ఉద్యోగినిలు అధికంగా పని చేసే శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దిశ లాంటి సంఘటన జరగడం దురదష్టకరమని, వారి కుటుంబ ...
Read More »విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
ఆర్మూర్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సెయింట్ పల్స్ పాఠశాలలో భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పెంట సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తరగతి గదిలో స్కూల్ వర్క్లో ‘ఆకలి’ అనే అక్షరానికి బదులు ‘అకలి’ అని రాయడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తనయుడు ఆణ్ణోపాల్ అలియాస్ బబ్లు విద్యార్థినిని వీపుపై కర్రతో విపరీతంగా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లి విజయ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ...
Read More »