నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి, 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు గల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తన మాతృ మూర్తికి వ్యాక్సిన్ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1 నుండి జిల్లాలో జిల్లా ప్రభుత్వ ...
Read More »తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. దాదాపు వంద మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి నిలబడుతుందన్నారు. నిజామాబాద్ నగరంలో గురువారం కేర్ ఫిజియోథెరపీ ...
Read More »మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పోస్టులు
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల / ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్లో సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయటానికి కాంట్రక్ట్ పద్ధతిలో ఒక సంవత్సర కాలము నియమించుటకు వైద్య విద్య సంచాలకులు తెలంగాణ, హైదరాబాద్ అనుమతి ఇచ్చినట్టు మెడికల్ కళాశాల ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 9వ తేదీ నుంచి 16 వరకు దరఖాస్తులను ప్రధాన ఆచార్యులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల కార్యాలయములో అందజేయాలని ...
Read More »మారిన లైఫ్ స్టైల్ తోనే అనారోగ్యాలు
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శారీరక శ్రమ లేకపోవడం ఆహారపు అలవాట్లలో మార్పు నిద్రలేమి తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గ్రేసీ స్వచ్ఛంద సంస్థ అందజేసిన క్యాన్సర్ పరీక్షల మొబైల్ వాహనాన్ని స్థానిక ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రజలు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమతో పాటు నడక మంచి ...
Read More »31న పల్స్ పోలియో
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వా దవాఖానలో ఏఎన్ఎం లకు, అంగన్ వాడి టీచర్స్, వలంటరీస్కి వైద్యాధికారి డాక్టర్ షాహీద్ అలీ పల్స్ పోలియోపై అవహగహన కల్పించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం ఆసుపత్రి పరిధిలో గల రామారెడ్డి -ఎ, రామారెడ్డి-బి, ఇస్సన్నపల్లి, ఉప్పల్ వాయి, గిద్ద, పోసానిపెట్, వడ్లూర్ ఎల్లారెడ్డి, సబ్ సెంటర్లలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. పల్స్ పోలీయో కార్యక్రమం 31 జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ ...
Read More »తేనె సాయి మందిరంలో ఉచిత వైద్య పరీక్షలు
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని తేనె సాయి మందిరంలో గురువారం మెడి కవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పర్షీలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కో ఆర్డినేటర్ భరత్ పేర్కొన్నారు. సుమారు 60 నుంచి 80 మంది వరకు ప్రతి గురువారం పరీక్షలు నిర్వహించుకుంటారని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది శ్రావణి, భూమిక పాల్గొన్నారు.
Read More »కోవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బోధన్ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కేంద్రాన్ని బోధన్ శాసనసభ్యులు ఎండి.షకిల్ ఆమ్మేర్ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది, ఆరోగ్య కేంద్రం సిబ్బంది 60 మందికీ కోవిషీల్డ్ టీకాలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎండీ. షకిల్ ఆమ్మేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరోనా మహమ్మారి నుండీ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామన్నారు. వ్యాక్సిన్ను ...
Read More »వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్సపల్లి పిహెచ్సిలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్స్, సదుపాయాలు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా సమస్య వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, వైద్య సిబ్బంది ఎంతవరకు తయారుగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్, వాటర్ సౌకర్యము, యాంటీ రియాక్షన్ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. అనంతరం వ్యాక్సిన్ ...
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు. ...
Read More »వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నందున నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న 302 వాయిల్స్ను భద్రపరిచిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పర్యటించారు. అనంతరం నిజామాబాద్ ప్రభుత్వం ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. కలెక్టరేట్లో కోవిడ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ...
Read More »400 కోళ్ళు మృతి
డిచ్పల్లి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తాండా లోని దుర్గాభవాని బ్రాయిలర్ పౌల్ట్రీ ఫాంలో 12, 13వ తేదీల్లో 400 కోళ్ళు అకస్మాత్తుగా మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమాని రాంచందర్ తెలిపారు. కాగా జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ భరత్, జిల్లా వ్యాధి నిర్దారణ కేంద్రం, సహాయ సంచాలకులు డాక్టర్ కిరణ్ దేశ్ పాండు, స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి పౌల్ట్రీని సందర్శించారు. ...
Read More »కోవిడ్ వ్యాక్సిన్ గురించి సిద్ధం కండి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెలలో వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జనవరిలో వ్యాక్సిన్ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ...
Read More »యు.కె.స్ట్రెయిన్ భయంకరమైనది కాదు
హైదరాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యు కే స్ట్రెయిన్ భయంకరమైనది కాదని, దీనికి ఎక్కువ చంపే శక్తి లేదని, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది అని నిపుణులు చెప్తున్నారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నామని, 10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారన్నారు. ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని, కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ...
Read More »ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నగరంలోని నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేశ్.వి.పాటిల్ హాజరయ్యారు. ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మేయర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ వారు పేద ప్రజల ఆరోగ్యం విషయమై హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయటం ...
Read More »21 నుండి నమూనాల సేకరణ
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో కోవిద్ -19 సెరో సర్వైలైన్స్ పరీక్ష ఫలితాలు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ వారు కరోనా వైరస్ వ్యాప్తి పరీక్షలను రెండుసార్లు నిర్వహించినట్టు జిల్లా వైద్య అధికారి డాక్టర్ శోభారాణి తెలిపారు. రెండవ విడుత కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆగష్టు 26, 27 తేదీలలో రెండవ విడుత సెరో సర్వైలెన్స్ ఫలితాలు ఈ విధంగా వున్నాయని తెలిపారు. చిన్నఎడ్డి, పెద్ద కొడపగల్, భవాస్పేట, నేరల్, ధర్మారం, ...
Read More »ఉద్యోగుల వివరాలు అందజేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ 19 వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబుల ఉద్యోగుల వివరాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం చర్చించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో మంగళవారం డిఎం అండ్ హెచ్వో డాక్టర్ సుదర్శనం ఆధ్వర్యంలో జిల్లా ఐఎంఎ, తానా అసోసియేషన్ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఎవరైనా ప్రయివేటు ఆసుపత్రుల వారు ఉద్యోగుల వివరాలు అందజేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ జీవన్రావు, ...
Read More »అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారి ఆదేశానుసారం, జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో లినర్స్ ప్రాక్టీషనర్ మిడ్ వైఫ్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం (నర్సు ప్రాక్టీషనర్ మిడ్ వైఫ్స్ – ఎన్పిఎం) కోసం బి.యస్.సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సు 18 నెలలు ఉంటుందని, కోర్స్ పూర్తి చేసి సంబంధిత ...
Read More »ఇద్దరికి కరోనా పాజిటివ్
కామరెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షల క్యాంప్ నిర్వహించినారు. క్యాంపులల్లో రామరెడ్డి గ్రామంలో 40 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 40 మందికి, పోసానిపేట్ గ్రామంలో 40 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 40 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 40 కరోన పరీక్షలు నిర్వహించారని డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 16 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మందికి ...
Read More »దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.చంద్రశేఖర్ వసేక్టమీ పక్షోత్సవం అవగాహన కార్యక్రమములో తన సందేశాన్ని తెలిపారు. కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం ఉండాలని, ఇద్దరు పిల్లలు గల దంపతులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిచాలని, మగవారు వసేక్టమీ చేయించుకోవాలన్నారు. ఈ విధానం సులభమైనదని,.దీని వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.. దాంపత్య జీవితంలో కుటంబ నియంత్రణ పురుషులకు ప్రోత్సాహించాలని, కొత్త, కుట్టు, లేని చాలా సులభమైన విధానం కేవలం ఐదు ...
Read More »రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్ గ్రామంలో 42 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన ...
Read More »