కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో బుధవారం రాబోయే వినాయక ఉత్సవాల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు గత సంవత్సరం లాగానే ప్రతి యువజన సంఘం వాళ్ళు తక్కువ ఎత్తు గల వినాయకులను ప్రతిష్టించి, భక్తి శ్రద్దలతో పూజలు ...
Read More »రక్తదాత.. ప్రాణదాత…
కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన శిరీష (26) గర్భిణీ రక్తహీనతతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధ పడడంతో వారు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి వ్యవసాయ విస్తరణాధికారి అశోక్ రెడ్డి సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ బి నెగిటివ్ గ్రూపు రక్తం పదివేల మందిలో 300 ...
Read More »ఫోన్ ఇన్లో 52 ఫిర్యాదులు
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం జనహిత భవన్లో ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 52 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 13, పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి 10, పింఛన్లు 3, తాగునీరు 4, రోడ్ల సమస్య గురించి 13, వ్యవసాయం సంబంధించి సమస్యలపై 10 చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...
Read More »జన్మదినం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్ బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో సోమవారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని ...
Read More »ఊరికొకటే వినాయక విగ్రహం
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడ కుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామస్తులు పండుగ నేపథ్యంలో తీర్మానం చేశారు. ఈయేడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యూత్క్లబ్ు, యువజన సంఘాలు, గణేశ్ మండలీలు ఎవరు కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేయొద్దని తీర్మానించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మల్లన్న గుడి వద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతిరోజు పురోహితుడు ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారని ...
Read More »పదిమంది కలెక్టర్లకు గ్రీన్ చాలెంజ్
కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పదిమంది కలెక్టర్లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం 10 మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముమ్మరంగా చేపడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ...
Read More »15న ప్రమాణాలు చేయించాలి
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గందగీ ముక్తి భారత్ (జిఎంబి) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8 నుండి వారం రోజుల పాటు ప్రజలకు పారిశుద్యంపై అవగాహన కలిగించేందుకు వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఆగష్టు 8 వ తేదీన సర్పంచ్లతో సమావేశాలు నిర్వహించాలని, 9 వ తేదీన సర్పంచ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించాలని, వాటి నుండి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ను వేరు చేయడంపై ...
Read More »మద్యం దుకాణాలు తెరవడం సరికాదు
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో గుడి, బడి బంద్ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్ టిజివిపి ప్రొబిషనల్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్వోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిలపక్ష ...
Read More »వేదికల చుట్టూ పచ్చదనం పెంపొందించాలి
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదికల నిర్మాణ పనులు ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాచారెడ్డి మండలం భవానీపేట, పాల్వంచ, ఫరీదుపేట లచ్చాపేట గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఈ నెల 25 లోగా నిర్మాణాలు పూర్తి కావాలని పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. రైతు వేదికల చట్టూ పచ్చదనం పెంపొందించాలని, పెద్ద మొక్కలు ...
Read More »కాగిత రహిత పాలనలో శిక్షణ
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాగిత రహిత పాలనలో భాగంగా జిల్లా అధికారులకు, సిబ్బందికి ఇ ఆఫీస్ ఫైల్ మేనేజిమెంట్ విధానం శుక్రవారం జనహిత భవన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు సెషన్లలో అధికారులకు, సిబ్బందికి దస్త్రాల కంప్యూటరీకరణపై ఎన్.ఐ.సి. జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి రవి బండి శిక్షణ అందించారు.
Read More »జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ ప్రభావం వున్నందున ప్రజావాణికి ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు 08468220044 ఫోన్ నెంబర్లో సమస్యలు తెలపాలని కోరారు. ప్రతి సోమవారం జరిగే ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు ...
Read More »కరపత్రాల ద్వారా సీజనల్ వ్యాధుల అవగాహన
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నివారణ చర్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్వేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు గురువారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన కరోనా జ్వరం సీజనల్ జ్వరానికి గల లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేసే బోరచర్లను పోస్టర్ను జిల్లా కలెక్టరు విడుదల చేశారు. ప్రస్తుతం అంటు వ్యాధులు ప్రబలే కాలల కాబట్టి, ఈ కాలంలో వచ్చే వ్యాధి లక్షణాలపై ...
Read More »15లోగా రుణాలు ఇవ్వాలి
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు ఆగస్టు 15 లోగా రుణాలు వంద శాతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో మున్సిపల్ కౌన్సిలర్లు, మెప్మా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు అందరికీ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. నిరుపేదలకు రుణాలు ఇచ్చి వ్యాపారాలు చేసే విధంగా చూడాలన్నారు. వార్డుల్లో పార్కు ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ...
Read More »కామారెడ్డిలో జయశంకర్ సార్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »సార్ ఆశించిన తెలంగాణ ఇది కాదు
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢల్లీి వరకు తన వాణి వినిపించిన మహోన్నతమైన వ్యక్తి జయశంకర్ ...
Read More »శతాబ్దాల కల సాకారమైంది
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన సందర్బంగా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల 5 శతాబ్దాల కల నెరవేరిందని యుగ పురుషునికి ఆలయం నిర్మితం కాబోతోందని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటు పోట్లు ఎంతోమంది కరసేవకుల ...
Read More »అందరు సహకరించండి…
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారితో కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరగడంతో ఆగస్టు 5 తేదీ నుండి 14 తేదీ వరకు అన్ని దుకాణాలు స్వచ్చందంగా బంద్ పాటించడం జరుగుతుందని తెరాస పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణు గోపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఛాంబర్స్ ఆఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజవాడ రవికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ ఆండ్ ...
Read More »5 నుంచి 14 వరకు లాక్డౌన్
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ఆదివారం అఖిల పక్షం (అన్ని రాజకీయ పార్టీలు) మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశమయ్యారు. వైరస్ కట్టడి కొరకై ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు స్వచ్చందంగా సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. కావున ప్రజలు మరియు వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్డౌన్ పాటించి కామారెడ్డి పట్టణాన్ని కరోనా బారినుండి కాపాడాల్సిందిగా కోరారు.
Read More »ముందస్తు చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు నీటి నిల్వను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లోని టైర్లలో ఉన్న నిలువ నీటిని తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ ...
Read More »కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన
కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో మాత్రమే పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ ప్రార్థనలు చేసి కరోనా మహమ్మారితో దేశ ప్రజలను, ప్రపంచాన్ని కాపాడాలని దేవుని ప్రార్థించారు. కరోనాతో ఆరు నెలల నుండి పనులు దొరకక ఉపవాసాలు, బాధలతో ఎంతో మంది అతలాకుతలమవుతున్నారని, వారందరు కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడాలని నమాజ్ ...
Read More »