కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం సుండు శివరాజవ్వ, దువ్వాల శంకర్ ఇద్దరు అవుట్ సోర్సింగ్ కార్మికులను ఉత్తమ పారిశుధ్య కార్మికులుగా గుర్తించి కామారెడ్డి మునిసిపల్ చైర్ పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి, వార్డు కౌన్సిలర్ మాడురి అనుష ప్రసన్న కుమార్, యం.దేవేందర్ కమీషనర్ పారిశుధ్య కార్మికులను శాలువా పూల దండలతో సన్మానించారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు యం.దేవదాసు, యం.డి.పర్వేజ్, పురపాలక సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Read More »నేలల దినోత్సవం సందర్బంగా మొక్కలకు ఎరువులు..
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారము ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పురపాలక సంఘ కార్యాలయంలో మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్ళు పోయడం మరియు ఎరువులు వేయడం చేశారు. కార్యక్రమములో చైర్ పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి, వార్డు కౌన్సిలర్ మాడురి అనుష ప్రసన్న కుమార్, మునిసిపల్ కమీషనర్ యం.దేవేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు యం.దేవదాసు, యం.డి.పర్వేజ్, అబ్దుల్ మోమిన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, శ్రీధర్ రెడ్డి, సునీత పాల్గొన్నారు.
Read More »ఇద్దరికి కరోనా పాజిటివ్
కామరెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షల క్యాంప్ నిర్వహించినారు. క్యాంపులల్లో రామరెడ్డి గ్రామంలో 40 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 40 మందికి, పోసానిపేట్ గ్రామంలో 40 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 40 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 40 కరోన పరీక్షలు నిర్వహించారని డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 16 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మందికి ...
Read More »గరిశకుర్తి రచనల ద్వారా నిలిచి ఉంటాడు…
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాను చేసిన సాహిత్య సృజన ద్వారా కవిగా, రచయితగా గరిశకుర్తి రాజేంద్ర ప్రజల మనస్సుల్లో కలకాలం నిలిచి ఉంటాడని, అన్ని స్థాయిల్లోని జనులకు అర్థమయ్యే రీతిలో రాసిన ప్రతిభ గరిశకుర్తికి సొంతమని తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం తెరవే ఆధ్వర్యంలో కామారెడ్డి కర్షక్ బి.ఇడి. కళాశాలలో గరిశకుర్తి రాజేంద్ర సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు మాట్లాడారు. ...
Read More »వీధి వ్యాపారుల రుణాలు మంజూరు చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారుల రుణాలు 10 వ తేదీలోగా వంద శాతం శాంక్షన్ చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. శుకవారం తన ఛాంబర్లో జరిగిన వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల రుణాలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారులకు అందించే రుణాల లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని, బ్యాంక్ అధికారుల సమన్వయంతో 15 వ తేదీలోగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ ...
Read More »దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.చంద్రశేఖర్ వసేక్టమీ పక్షోత్సవం అవగాహన కార్యక్రమములో తన సందేశాన్ని తెలిపారు. కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం ఉండాలని, ఇద్దరు పిల్లలు గల దంపతులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిచాలని, మగవారు వసేక్టమీ చేయించుకోవాలన్నారు. ఈ విధానం సులభమైనదని,.దీని వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.. దాంపత్య జీవితంలో కుటంబ నియంత్రణ పురుషులకు ప్రోత్సాహించాలని, కొత్త, కుట్టు, లేని చాలా సులభమైన విధానం కేవలం ఐదు ...
Read More »విద్యార్థి అమరవీరుడికి ఘన నివాళి
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : (తెలంగాణ విద్యార్థి పరిషత్) టీజీవిపి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అమరుడైన శ్రీకాంత చారి 11 వ వర్ధంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డ్ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటిపై పెట్రోలు పోసుకుని శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేస్తే నేడు స్వరాష్ట్రంలో భోగాలు మాత్రం కెసిఆర్ కుటుంబానికి దక్కాయని టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్ ఆరోపించారు. ...
Read More »రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్ గ్రామంలో 42 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన ...
Read More »శస్త్ర చికిత్సపై విస్తృత అవగాహన
కామారెడ్డి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం జిల్లా వై ద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వసేక్టమీ పక్షోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హత గల దంపతులకు కుటుంబ నియంత్రణలో పురుషులకు వసేక్టమీ చాలా సులభమయిన విధానమని సూచించారు. ఆరోగ్య సిబ్బంది పురషుల శాశ్వత కుటుంబ నియంత్రణ వసేక్టమి (ఎన్ఎస్వి) కోత, కట్టు లేని 5 నిమిషాలలో పూర్తవుతుందన్నారు. దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇద్దరు పిల్లలు గల దంపతులు మగవారు ...
Read More »కార్పొరేషన్ రుణాలకు చివరి అవకాశం
కామరెడ్డి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సి కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక 2018-19 కింద సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు బ్యాంకు మరియు మండల పరిషత్ అధికారులు, మునిసిపల్ కమిషనర్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయని ఎస్సి కార్పొరేషన్ కార్య నిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా తమ తమ దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ వరకు బ్యాంకు సమ్మతితో తమ మండల ప్రజా పరిషత్ అధికారి / మునిసిపల్ కమిషనర్ల ద్వారా ఎస్సి ...
Read More »పల్లె ప్రగతిపై సమీక్ష
కామారెడ్డి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 3 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయాలలో పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రూ. 651 కోట్లు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ...
Read More »పద్దతి మార్చుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిజిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మొహమ్మద్ అలీ షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి దయాకర్ పాల్గొని ప్రసంగించారు. దళిత సర్పంచ్ రాజుపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం అని, అభివద్ధి చేస్తున్న సర్పంచ్ పై వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఎమ్మెల్యే చెప్తే విచారణ ...
Read More »ఛలో కలెక్టరేట్
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 2న బుధవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో జనగామ దళిత సర్పంచ్ రాజు పై సస్పెన్షన్ ఎత్తివేయాలని చలో కలెక్టర్ రేట్ కార్యక్రమం చేపట్టినట్టు నాయకులు లక్కపత్ని గంగాధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణా శాసనసభ ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ పాల్గొంటారన్నారు. అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ...
Read More »అబలలు కాదు సబలలు
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతి చిన్న వయస్సులో మున్సిపల్ చైర్ పర్సన్గా పదవి పొందిన కుమారి నిట్టు జాహ్నవిని అతి పిన్న వయస్సులోనే ఎవరైస్టు శిఖరాన్ని అధిరోహించి భరత జాతి ఖ్యాతిని ఇనుమడించిన మాలోతు పూర్ణ అభినందించారు. స్థానిక సమన్య హోటల్లో మున్సిపల్ చైర్పర్సన్ను మాలోతు పూర్ణ కలిసి అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి మున్సిపాలిటీని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దాలని ఆమె ఆకాక్షించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునని, ఆడవారు అబలలు కాదు సబలలు అని, అన్ని ...
Read More »సర్వేలో పారదర్శకత పాటించాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల భాగస్వామ్యంతో మిషన్ అంత్యోదయ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శనివారం జనహితలో డివిజనల్ పంచాయితీ అధికారులు, మండల పంచాయితీ అధికారులు, పంచాయితీ రాజ్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎపిఓ ఎపిడిలు, రిలయన్స్ స్వచ్చంద సంస్థ ప్రతినిథులకు నిర్వహించబడిన మిషన్ అంత్యోదయ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొందాలని, అనంతరం మండల స్థాయిలో గ్రామ ...
Read More »మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. శనివారం ఆయన టేక్రియల్ చౌరస్తా వద్ద హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటుచేసి, రక్షణ కంచె వేయాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా మునిసిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పాత జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని కోరారు. మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన ...
Read More »పదవీ విరమణ
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి కార్యాలయములో పబ్లిసిటీ అసిస్టెంట్గా పనిచేస్తూ ప్రభుత్వ సర్వీసు నుండి శనివారం పదవీ విరమణ చేసిన వస్తాద్ గంగాధర్ గౌడ్ను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు సన్మానించారు. కార్యక్రమంలో కార్యాలయ టైపిష్టు దేవుజి, పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంభీర్ మనోహర్ రావు, సునీత, కళాకారులు రమేశ్ రావు, మల్లిఖార్జున్, శ్రీనివాస్, పోశెట్టి పాల్గొన్నారు.
Read More »జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని, మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. అట్టడుగు ...
Read More »డిసెంబర్ 15 లోగా పూర్తిచేయండి
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కజొన్న కొనుగోళ్లను డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం జనహిత భవన్లో వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులతో మొక్కజొన్న కొనుగోలుకు చేపట్టే చర్యలను ఆయన సమీక్షించారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టే కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, బయట కొని కేంద్రాలలో అమ్మినా, లెక్కలలో తారుమారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ కొనుగోలు ...
Read More »సమస్యలుంటే చెప్పండి
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి ధాన్యం గోదామును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎస్.ఎస్.నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేందాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అని అడిగారు. కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. అనంతరం బికనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రైస్ మిల్లును సందర్శించి కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టరు డాక్టర్ ...
Read More »