నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, పలువురు అధికారులు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ...
Read More »మాక్లూర్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవీడ్ లక్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్లోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించి కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాలపై లక్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ...
Read More »కోవిడ్ కేర్ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో కోవిడ్ కేర్ కేంద్రాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్లో వంద పడకల స్థాయికి, ఆర్మూర్, బోధన్లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాలనీ, అంబులెన్స్ ...
Read More »కోవిడ్ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ సెకండ్ వేవ్ మరియు వాక్సినేషన్పై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్ ను ...
Read More »ఘనంగా ఎన్.ఎస్.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ నగరం కాంగ్రెస్ భవన్లో ఎన్.ఎస్. యూ.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి హాజరై ఎన్.ఎస్.యూ.ఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడే తత్వం మరియు నాయకత్వ లక్షణాన్ని పెంపొందించి ...
Read More »మహమ్మారి నిర్మూలనకు మన జాగ్రత్తలే ప్రధానం
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు శాఖ తీసుకోవలసిన చర్యల గురించి శుక్రవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్ వీడియో కాన్స్ రెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ నివారణకు గానూ ప్రతి ఒక్కరు మాన్క్ ధరించడం అత్యంత ప్రధానమని ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. పోలీసు సిబ్బంది స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించడం కుటుంబ సభ్యుల పట్ల ...
Read More »15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల వివరాలు అందించండి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆదుకుంటుందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం బీఆర్కె భవన్ నుండి ఆమె పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల శాఖ డిసిఎస్వోు, డిఎంతో వీడియో కాన్ఫరెన్స్ ...
Read More »ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పరికరాల పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల వయసుగల ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు అంచనా క్యాంపు 2018లో నిర్వహించారు. దాని ద్వారా 195 లబ్దిదారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉపకరణములు పంపిణీ చేశారు. పంపిణీ చేయబడిన పరికరముల వివరాలు : వీల్చైర్లు 20, ట్రై సైకిల్స్ 1, ఎం.ఆర్.కిట్స్ 45, వినికిడి యంత్రాలు 100, బ్రెయిలీ కిట్స్ 2, మెడభాగం ...
Read More »ఈజీఎస్ ద్వారా గ్రామాలకు మంచి పనులు జరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కూలీ లభించడమే కాకుండా ఆయా గ్రామాలకు మంచి పనులు కూడా చేసి పెట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెలలపాటు కూలీల కోసం అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 శాతం పైగా అంటే ...
Read More »శ్రీనివాస్కు డాక్టరేట్
డిచ్పల్లి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగపు పరిశోధక విద్యార్థి ఎ. శ్రీనివాస్కు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.సవీన్ సౌదా పర్యవేక్షణలో ‘‘నియో స్లేవ్ నేరటీవ్స్ ఇన్ సెలెక్ట్ నావెల్స్ బై ఎడ్వార్డ్ జోన్స్ అండ్ టోని మోరిసన్’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ...
Read More »కోవిడ్ చికిత్సలకు సిద్ధం కండి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని, ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని ...
Read More »రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మంగళవారం యూనియన్ కార్యాలయం, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో జరుగనుందన్నారు. రాష్ట్ర మహాసభకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణ, కే.సూర్యం తదితరులు అతిథులుగా వస్తున్నారన్నారు. రాష్ట్ర ...
Read More »టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పెరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు – కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ఫోర్సుమెంట్ విస్తృత తనిఖీలు చేయాలి, బయట తిరిగే ప్రజలందరూ మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి, వ ృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వీరిలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్ జరగాలి, టెస్టులు పెరగాలి- అప్పుడే వైరస్ అరికట్టడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్లో తన ఛాంబర్లో వేరువేరుగా సంబంధిత ...
Read More »కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత విస్తృత ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్రస్థాయి అధికారులైన రిజ్వి, రాహుల్ బొజ్జా, రోనాల్డ్ రోస్, డాక్టర్ ప్రీతిమీనా, డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ...
Read More »ఆసుపత్రి మూసివేత
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్న యజమాని డాక్టర్ నిష్కల్ ప్రభుకు కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పటికీ అతను పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి కోవిడ్ చికిత్సలు నిర్వహించగా ఆస్పత్రిలోని 30 మందికి, సిబ్బంది 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డిఎంఅండ్హెచ్వో తెలిపారు. ఆసుపత్రి యజమాని ప్రభుకు కూడా ...
Read More »రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాలలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, సంబంధిత గుత్తేదారులు, అధికారులతో కలిసి సారంగాపూర్, మంచిప్ప, గడ్కోల్, మెంట్రాజ్ పల్లి, భూపాపల్లి తదితర ప్రాంతాలలో పైపులైన్ల పనులు, కాలువల పనులు ఇతర పనులను పరిశీలించారు. ఈ ...
Read More »కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డిఓ రవికుమార్, యస్సి కార్పొరేషన్ ఈడి రమేష్, ...
Read More »బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన ప్రజల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధులతో కలిసి ...
Read More »గల్ఫ్ సంఘాల ప్రతినిధుల కేరళ పర్యటన
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గల్ప్ ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ప్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8,9,10 మూడు రోజుల పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్, ప్రవాసి ...
Read More »నిరుద్యోగులపై ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మ హత్యకు నిరసనగా నిజామాబాద్ ఎన్.ఎస్.యూ.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ సునీల్ నాయక్ ది ముమ్మాటికీ ...
Read More »