నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వం మంజూరుచేసిన కోవిడ్ 19 పరీక్ష కేంద్రం (వైరాజీ ల్యాబ్) ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ 19 పరీక్షలు స్థానికంగా నిర్వహించదానికి వీలుగా ప్రభుత్వం పంపిన వైరాలజీ ల్యాబ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 పరీక్షల కొరకు ప్రభుత్వం పంపిన ఎక్విప్మెంట్ వచ్చిందని, లాబ్ ఏర్పాటు ...
Read More »ఐదుగురికి కరోనా….
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 37వ వార్డు అశోక్ నగర్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. వీరంతా ఐదు రోజుల క్రితం వర్లీ ముంబై నుండి వచ్చారని, 8 మంది నమూనాలను పంపగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Read More »‘పది’ దాటింది…
హైదరాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ...
Read More »డేంజర్ బెల్స్…
పల్లెకు పాకిన మహమ్మారి జిల్లాల్లో వేగంగా వ్యాప్తి…. భయం గుప్పిట్లో జనం… తగ్గినట్టే అనిపించిన మహమ్మారి తన విశ్వరూపం చూపెడ్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం నిర్లక్షంగా వ్యవహరించడంతో వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. మర్కజ్ కేసుల అనంతరం ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. తదుపరి సడలింపులతో తమకేమీ కాదులే అన్న దోరణితో వ్యవహరించడంతో ఈ సారి మరింత తీవ్రంగా ప్రబలే అవకాశాలున్నాయి. గ్రామాలకు వ్యాప్తి… లాక్డౌన్ కాలంలో పల్లె ప్రజానీకం పూర్తి జాగ్రత్తలు పాటించారు. అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ లభించిన అనంతరం ...
Read More »కరోనా బాధితుడిపై కవిత మమకారం
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. మొదట గుండెనొప్పి రావడంతో స్నేహితులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో గుండె జబ్బులతో పాటు కరోనా వ్యాధి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి ముగ్గురు పిల్లలు, భార్య కుటుంబ సభ్యులను నెలసరి వేతనంతో పోషిస్తోండగా మార్చి 16న ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రిలో చేరిన ...
Read More »కామారెడ్డిలో కరోనా…
కామారెడ్డి, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్ నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించారు. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఒమేగా అనే మహిళ ముంబై నుండి గత 13 రోజుల క్రితం రామారెడ్డి మండలంలోని పోసాని పేట్ గ్రామంలో తన సొంత మేనమామ ఇంటికి వచ్చింది. ముందు జాగ్రత్తలు తీసుకొని వారం రోజుల పాటు హోం క్వారెంటేన్లో ఉంచి పర్యవేక్షించామని అన్నారు. ఆమె పూర్తి పేరు గొడుగు ...
Read More »జూన్ 30 వరకు లాక్డౌన్
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఆదివారంతో లాక్డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని ...
Read More »మదన్మోహన్ రావుకు సన్మానం
నిజాంసాగర్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసంలో రాష్ట్ర ఐటి సెల్ అధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మదన్ మోహన్ రావుని రాష్ట్ర జడ్పీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కాగా మదన్ మోహన్ రావు ఇటీవల హూమన్ రైట్స్ ఇండియా సంస్థ అవార్డు పొందిన విషయం తెలిసిందే. మదన్ మోహన్రావును కలిసిన వారిలో పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.
Read More »కార్మికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక సమాచార విభాగం
హైదరాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాల నుంచి వచ్చే కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమాచార విభాగం ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు నేరుగా సమాచార విభాగం దగ్గరకు వెళ్తే వారు కోరుకున్న మేరకు క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వారం రోజులకు భోజనం, వసతికి కలిపి ప్రీమియం కేటగిరికి 16 వేలు, స్టాండర్డ్ కేటగిరికి 8 వేలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేద గల్ఫ్ కార్మికులు డబ్బు ...
Read More »షబ్బీర్ అలీ రూ. లక్ష విరాళం
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ గాంధీభవన్లో టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ లక్ష రూపాయల చెక్కు విరాళంగా అందజేశారు. కరోన మహమ్మారి వలన ఎంతోమంది వలస కూలీలు కాలినడకన వారి రాష్ట్రాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదులుతున్నారని, వారిని కాపాడడానికి తన వంతుగా వలస కూలీల ప్రయాణ ఖర్చుల కొరకు లక్ష రూపాయలు అందజేసినట్టు పేర్కొన్నారు.
Read More »హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపికైన మదన్మోహన్ రావు
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కోవిడ్ – 19 ప్రశంసా అవార్డును అందుకున్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. కరోనా కోవిద్ 19 వైరస్ ప్రబల కుండ ఓజోన్, హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేస్తూ, మదన్ మోహన్ రావు చేస్తున్న ఉద్యోగ ఉపాధి సహాయము, పేద ...
Read More »సిఎం సహాయనిధికి రూ.61 లక్షలు
హైదరాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సాయంగా తెలంగాణ రాష్ట్రంలోని న్యాయాధికారులు, జ్యూడిషియల్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని రూ. 61 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి అందించారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ కార్యక్రమంలో పాల్గొనారు.
Read More »కరోనా కట్టడిలో భాగంగా రసాయన ద్రావణం పిచికారీ
నిజాంసాగర్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డి పెట్ మండలం గోలి లింగా గ్రామంలో గురువారం హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మదన్ మోహన్ రావు ట్రస్టు సంఘం సౌజన్యంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్ రసాయనం, సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పూర్తి స్థాయిలో పిచికారి చేసే కార్యక్రమాన్ని జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, ఎంపీపీ రాజు దాసు ప్రారంభించారు. అంతకుముందు మండల ప్రజల క్షేమం కోసం కరోనా వైరస్ ...
Read More »కామారెడ్డి ప్రజలకు పోలీసుల హెచ్చరిక
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సందర్భంగా కొంతమంది పాత నేరస్థులు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారు దొంగతనం చేసేందుకు అవకాశం ఉన్నందున కనీస జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరమని కామారెడ్డి పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చినపుడు వారిని దూరంగా ఉంచి మాట్లాడాలని, అనుమానితులు మీ వీధుల్లో సంచరించినట్లయితె వెంటనే సంబందిత పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మీరు ఇంటికి తాళం వేసి పక్క ఉళ్ళకు వెళ్ళినపుడు ...
Read More »కోవిడ్ పరిశోధనలకు కామారెడ్డిలో రక్తనమూనాల సేకరణ
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని ఐదు గ్రామాల్లో ప్రతి గ్రామంలో 40 కుటుంబాల చొప్పున ఐసిఎంఆర్ బృందం రక్తనమూనాలు సేకరించినట్టు డిఎం అండ్ హెచ్వో చంద్రశేఖర్ తెలిపారు. సేకరించిన రక్తాన్ని పరీక్షల నిమిత్తం చెన్నై వైరాలజీ కేంద్రానికి పంపామన్నారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్వో మాట్లాడుతూ అన్ని డివిజన్ల పరిధిలో మండలాలను ఎంపిక చేశామని, రక్త పరీక్షల వలన వైరస్ సంక్రమించడానికి ...
Read More »మిగిలిన ఒక్కరు డిశ్చార్జ్
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగిలిన ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా శనివారం డిశ్చార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుండి 61 మందికి కరోనా పాసిటివ్ నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. వారంతా శనివారంతో డిశ్చార్జ్ కావటం సంతోషించదగ్గ విషయమని అలాగే దాదాపు గత నెల రోజులుగా జిల్లాలో ...
Read More »ప్రభుత్వాలు ప్రజలకు ధైర్యం చెప్పాలి
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి, మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ ఆటోడ్రైవర్లకు, వృద్ధులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీ నీళ్లు ఆంధ్రకు వెళ్తే సంగారెడ్డి, ...
Read More »హెల్ప్ టు అదర్స్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాల పంపిణీ
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద మంగళవారం జాతీయరహదారి మీదుగా నాగ్పూర్ వైపు నడిచి వెళ్తున్న వలస కూలీలకు అమెరికాకు చెందిన హెల్ఫ్ టు అదర్స్ సంస్థ ఆద్వర్యంలో ఆహారపదార్ధాలు, వాటర్ బాటిళ్ళు, మాస్కులు అందజేశారు. అనంతరం ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శిబిరం ప్రతినిధులకు వలస కూలీలకు పంచేందుకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్ళు బిస్కట్లు అందజేశారు. ఈ సందర్భంగా హెల్ఫ్ టు అదర్స్ సంస్థ ఇండియా ...
Read More »అంబులెన్సులో ప్రసవం
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి సాయవ్వ (30) కి పురిటి నొప్పు రావడంతో 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సాయవ్వని హాస్పిటల్కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు. 3వ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని లింగంపేట్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 108 ...
Read More »లాక్ డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 131 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 111, ఆటోలు 19, ఫోర్ వీలర్స్ 1 ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...
Read More »