కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన టెలీ కాన్ఫరెన్సులో కలెక్టర్ రైస్ మిల్లు యజమానులతో మాట్లాడారు. ఫిబ్రవరి 20 లోగా మిల్లింగ్ పూర్తి చేస్తామని రైస్ మిల్లుల యజమానులు (హామీపత్రం రాసి దానిపై సంతకం చేసి) అండర్ టేకింగ్ ఇవ్వాలని సూచించారు. యాసంగిలో పండించిన వడ్లను గడువులోగా మిల్లింగ్ చేయని రైస్ మిల్లు ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 17 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 557 మందికి 3 కోట్ల 67 లక్షల 75 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స ...
Read More »ఫిబ్రవరి 20 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి వడ్లు మర పట్టించడం (మిల్లింగ్) ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. మిల్లింగ్ చేయడంలో అలసత్వం ప్రదర్శించే రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లింగ్ పూర్తి కాకపోతే సంబంధిత ఉప తహసిల్దారుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో డీఎస్ఓ కొండలరావు, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, రైస్ మిల్లుల యజమానులు ...
Read More »ఫిబ్రవరి 3 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 3 లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టెలీ కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో పంటల నమోదు ప్రక్రియను సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే క్రాప్ బుకింగ్ జరిగిందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి గుంటలో వేసిన పంటలను నమోదు చేయాలని ఆదేశించారు. రైతు బంధు సమితి సభ్యులతో ...
Read More »జిల్లాలో నాలుగు కొత్త బార్లు
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నాలుగు కొత్త బార్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి రెండు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి చొప్పున మొత్తం నాలుగు కొత్త బార్ల కోసం ఈనెల 25 వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు ఆఫీసు పని దినములలో దరఖాస్తులు స్వీకరించడం ...
Read More »టెట్ పై అవగాహన
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కర్షక బిఎడ్ కళాశాలలో ఆదివారం అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టెట్ ఉచిత డెమో తరగతులు నిర్వహించారు. టెట్ ఉచిత కోచింగ్కు అభ్యర్థులు హాజరయ్యారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు టిఎన్ఎస్ఎఫ్ ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుందని, కామారెడ్డి పట్టణ విద్యార్థులకు ఉచితంగా అవనిగడ్డ అధ్యాపకులచే తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. దీనిని నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే నోటిఫికేషన్లకు విద్యార్థిని విద్యార్థులందరు ...
Read More »విజయ డైరీ 30 శాతం రాయితీ ఇస్తుంది
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ యువత ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్ డెమో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతలు, జాతర్లు జరిగే చోట వాహనంపై పాల పదార్థాలు తీసుకెళ్లి విక్రయించు కోవాలని సూచించారు. బ్యాటరీతో ఆటో నడుస్తుందని, 10 గంటల పాటు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలపాటు ఈ కార్ట్ పనిచేస్తోందని తెలిపారు. వాహనం ధర ...
Read More »24 గంటల పాటు నడిపించి లక్ష్యాలు పూర్తి చేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 28 లోగా రైస్ మిల్లుల యజమానులు వడ్లను మర పట్టించడం (మిల్లింగ్) ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రైస్ మిల్లు యజమానులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రైస్ మిలర్లతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. యాసంగి మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లులను 24 గంటలపాటు నడిపించి లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. టెలీ కాన్ఫరెన్సులో ...
Read More »అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు గౌండింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లతో గొర్రెల యూనిట్ల గౌండింగ్ పై సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే 75 శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జగన్నాధచారి పాల్గొన్నారు.
Read More »సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో గజానాన్ పటేల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక అయినందుకు కామారెడ్డి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కలిసి జిల్లా యువజన అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానీ మీరు మమ్మల్ని సంప్రదించకుండా స్వయంగా మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఒంటెద్దు పోకడలకు ...
Read More »పెండింగ్ ముటేషన్లు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో ఉన్న పెండింగ్ ముటేషన్లను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో గురువారం ధరణి రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో వీఆర్ఏల ద్వారా రైతులకు అవగాహన కల్పించి స్లాట్ బుక్ చేసే విధంగా చూడాలని కోరారు. రైతుల పేర్లలో అక్షర దోషాలు ఉన్న వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, అసిస్టెంట్ ...
Read More »జిల్లా కలెక్టర్కు సన్మానం
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.చంద్రకాంత్, అధ్యాపకులు డా.టి.శ్రీనివాస్, శరత్ రెడ్డి, డా.శంకర్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, దేవేందర్ సన్మానించారు. ఇల్చిపూర్, కామారెడ్డి శివార్లలో గల కాలేజీకి చెందిన భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ను కలిసి పూలమొక్క సమర్పించి ధన్యవాదాలు తెలిపారు. ముళ్ళపొదలు, ఆక్రమణలతో కూడిన ప్రాంతంలోని భూముల రక్షణ కోసం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో కమిటీ నియమించి ...
Read More »వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డికి చెందిన సరస్వతి (56) సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసర పరిస్థితుల్లో 3 యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. బిబీపేట మండల కేంద్రానికి చెందిన సంతోష్ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత ...
Read More »తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న పాడి రైతన్నకు బకాయి పడిన ప్రోత్సాహక సొమ్ము జనవరి 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు మొత్తం 16 నెలలకు గాను 3 కోట్ల 51 లక్షల రూపాయల పాడి లబ్ది సొమ్మును మొత్తం పాడి రైతన్న ఖాతాలలో నేరుగా జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పాడి లబ్ది విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ...
Read More »31 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ పైపులైను పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం మిషన్ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు. అధికారులు ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, తాగునీటి వసతికి అన్ని చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ...
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు. ...
Read More »బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బలహీన వర్గాల అభివద్ధి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, బడుగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విఫ్, గంప గోవర్ధన్ నివాసంలో పెరికకుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పెరికకుల సంఘం) 2021 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బిసిలకు, ఎంబిసిలకు ...
Read More »శోభాయమానంగా శోభాయాత్ర….
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామాజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ నామ సంకీర్తన శోభయాత్ర కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ నుండి ప్రారంభమై పట్టణంలోని పుర వీధుల గుండా నిర్వహించారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు శిశుమందిర్ లో జరిగిన సభలో ముఖ్య అధితిగా విచ్చేసిన సోమయప్ప స్వామిజి మాట్లాడుతూ తరతరాల నుండి కలలు కన్న భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి హిందూ బంధువు దగ్గరకి రామ భక్తులు వెళ్లి నిధి సేకరించడం ...
Read More »రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డికి చెందిన అంజయ్యకు హైదరాబాదులోని యశోదా వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట్ గ్రామానికి చెందిన ఉప్పు కష్ణ సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రక్తదానానికి ముందుకు వచ్చిన కష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్ పాల్గొనడం జరిగింది.
Read More »ఆసరా పింఛన్ల డబ్బు రికవరీ చేయాలి
కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్ ఆపరేటర్ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ ...
Read More »