రెంజల్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి పార్టీ సభ్యత్వ నమోదులో యువతే కీలకమని భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. రెంజల్ మండలం నీలా గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్, పార్టీ సీనియర్ నాయకుడు సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ లోలపు రజినీ కిషోర్, జడ్పీటీసీ మేక విజయ సంతోష్లతో కలిసి పలువురికి సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
Read More »Daily Archives: July 10, 2019
సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగాలి
రెంజల్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పిలుపునిచ్చారు. మండలంలోని సాటాపూర్, రెంజల్ గ్రామాల్లో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలువురికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదును నాయకులు కార్యకర్తలు ఉద్యమంలా ...
Read More »అగ్రికల్చర్ సెక్రెటరీతో ఎంపి భేటీ
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్రికల్చర్ సెక్రెటరీ సంజయ్ అగర్వాల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం భేటీ అయ్యారు. అగ్రికల్చర్ సెక్రటరీ కార్యాలయంలో జరిగిన భేటీలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కాగా పసుపు పంటపై విస్తృతంగా చర్చించారు. రెండు వారాల్లో ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్ (పంట నాణ్యతను పెంచే కార్యక్రమం), పసుపు పంటకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ కోసం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో ఎంపీ అర్వింద్ ధర్మపురితో పాటు మరో ఇద్దరు రైతులకు పాల్గొనే అవకాశమున్నట్టు ...
Read More »నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటితోనే మానవ భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అంకుశాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో వర్షపునీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాలను పెంపొందించేందుకు దష్టి పెట్టకపోతే మానవ మనుగడ కు కష్టతరమని జల సంరక్షణలో అందరు భాగస్వాములు అయినప్పుడే సాధ్యమవుతుందని ఇది ఒక ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే ...
Read More »ప్లాస్టిక్ రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవాలి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా గుర్తింపు తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ జలశక్తి అభియాన్ అమలు జిల్లా నోడల్ అధికారి నికుంజ్ కిషోర్ సుంద రాయ్ అన్నారు. వర్షపు నీటి సంరక్షణ పద్ధతులపై గ్రామపంచాయతీ భవనములో సర్పంచ్ ఎంపిటిసి వార్డ్ మెంబర్తో పాటుగా ప్రజలకు ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో పడిన వర్షం నీటి కంటే ఎక్కువగా వినియోగించుకుంటున్నారని ...
Read More »తపస్ సభ్యత్వ నమోదు
బీర్కూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలో బుధవారం తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాటు పడుతుందన్నారు. మండలంలో సభ్యత్వ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నామ్దేవ్, మండల కార్యదర్శి బాలరాజ్, శోభన్బాబు పాల్గొన్నారు.
Read More »తెరాస పేదల ప్రభుత్వం
బీర్కూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాస ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని తెరాస రాష్ట్ర నాయకులు, సభాపతి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్లి గ్రామంలో బుధవారం బోయి కుటుంభ సభ్యుల కొరకు నూతనంగా నిర్మించనున్న 20 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం గ్రామంలో తెరాస సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ...
Read More »మొక్కలు నాటాలి… సంరక్షించాలి….
బీర్కూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ కిషోర్ యాదవ్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా హరిత హారంలో తమ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో మొక్కలు నాటీ వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. గ్రామం లో ప్రజలకు మొక్కలు పంచారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీ ...
Read More »జాతీయస్థాయి గుర్తింపు కోసం అంకాపూర్ కృషి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జలశక్తి అభియాన్ కార్యక్రమాలలో చేపట్టే జలసంరక్షణలో అంకాపూర్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు పొందే విధంగా గ్రామస్తులు కషి చేయాలని కేంద్ర ప్రభుత్వ సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, జలశక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి నికుంజ్ కిషోర్ సుందరాయ్ అన్నారు. బుధవారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై పాఠశాల విద్యార్థులచే ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో ...
Read More »పశువులకు టీకాలు
బీర్కూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని ధుర్కి గ్రామంలో బుధవారం పశు వైద్య అధికారులు ఆవులకు, గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ శ్యామల మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణకు గ్రామంలో గేదెల కు, ఆవులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More »విద్యాసంస్థల బంద్
డిచ్పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం డిచ్పల్లి మండలంలో విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే ధోరణి మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రించాలని పేర్కొన్నారు. పిడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అరుణ్, చిన్న విజయ్, ...
Read More »