కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మర్కల్ మల్లన్నగుట్ట మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఓ యువకుడు ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మల్లన్నగుట్ట వద్దగల నీటి ట్యాంకు నుంచి నీటిని శుద్దిచేసి కామారెడ్డి పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అక్కడ పనిచేస్తున్న పోసానిపేట గ్రామానికి చెందిన చాకలి నర్సింలు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబీకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి భారీగా తరలివచ్చారు. మృతుని భార్యకు ఉద్యోగంతోపాటు పదిలక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆందోళన చేశారు. ...
Read More »Daily Archives: July 14, 2019
గురుకుల పాఠశాల తనిఖీ
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదివారం ఆకస్మికంగా తనికీ చేశారు. వంటగది, స్నానపు గదులు, నీటి సమస్య తదితర సమస్యలు తెలుసుకున్న షబ్బీర్ అలీ సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోరాడి ఎంతో కష్టపడి 11 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రంలో 5 ఎకరాల స్థలంలో 13 కోట్ల నిధులతో నూతన ...
Read More »క్రమశిక్షణ గల కార్యకర్తలే బిజెపికి బలం
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ లింగాపూర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ జండా ఆవిష్కరించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతు మోదీ నాయకత్వంలో, అమిత్ షా మార్గ నిర్ధేశకత్వంలో దేశంలో కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గ్రామ గ్రామాన బీజేపీ విస్తరించిందని, దేశభక్తి ఊపిరిగా ...
Read More »బిజెపి సభ్యత్వ నమోదు
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం గాంధీనగర్కి చెందిన 20 మంది యువకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. అదే విధంగా ఆదివారం కామారెడ్డి 7వ వార్డు పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ యువతకు అడ్డాగా మారిందని, కామారెడ్డిలో యువకుల చేరికతో నూతనోత్తేజంతో పురపాలక ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతుందని, ...
Read More »ఎమ్మెల్యేను కలిసిన పూర్వ విద్యార్థులు
నందిపేట్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూత్పల్లి పాఠశాల పూర్వ విద్యార్థులు (1992 బ్యాచ్) ఆదివారం హైదరాబాద్ వెళ్లి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మండలంలోని విద్యా సమస్యలపై చర్చించారు. పూర్వ విద్యార్థులు ఇలా కలిసి మండల అభివద్ధి కొరకు ఆలోచించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ దొంకేశ్వర్ మల్లారెడ్డి, నికాల్పూర్ ఆశన్న, ఉషన్న, గంగసరం గంగిరెడ్డి, మారంపల్లి సాయిరెడ్డి, లింగ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read More »ఘనంగా బోనాల పండుగ
రెంజల్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలైన పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాన్ని ప్రతి యేటా ఆనవాయితీగా నిర్వహిస్తారు. రెంజల్ మండల కేంద్రంలో ఆదివారం గ్రామస్థులందరు కలిసి ఒకే చోటుకి చేరి బోనాలతో తరలి వెళ్తారు. ఎంపీపీ లోలపు రజినీ కిషోర్ గ్రామస్తులతో కలిసి బోనమెత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో ఘనంగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ...
Read More »అంజనాద్రి ఆలయంలో భజన కార్యక్రమం
నిజాంసాగర్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులోని అంజనాద్రి ఆలయంలో మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పట్లోల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాత్రి వేళల్లో అంజనాద్రి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిచ్కుంద, గోర్గల్, గున్కుల్, మొహమ్మద్ నగర్ గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిజాంసాగర్ ఎస్ఐ సాయన్నకు పట్లోళ్ల ...
Read More »చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. అన్ని వర్గాల అభివద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ అహర్నిశలు కషి చేస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం బింగి కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి విఠల్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో ముందుకు ...
Read More »మున్సిపల్లో కాంగ్రెస్ జండా ఎగుర వేస్తాం
నిజాంసాగర్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ జండా ఎగురవేయడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు వీధి వీధిలో తిరిగి శంకుస్థాపనలు చేసినంత మాత్రాన పని అయిపోదని వెంటనే పనిని మొదలు పెట్టాలని అన్నారు. సామెత గుర్తుకు వస్తుంది ఇల్లు అలకగానే పండుగ కాదని అలాగే కొబ్బరికాయ కొట్టగానే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవడం పప్పులో కాలేసినట్టే అని ఆయన అన్నారు. రైతు బజార్ను ...
Read More »ఎస్ఐ ఎంపికైనా కళ్యాపూర్ యువకుడు
రెంజల్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన అమాంద్ అరవింద్ (28) శుక్రవారం రాత్రి వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. వత్తి రీత్యా వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు అమాంద్ తుకారాం, లలితల రెండవ కుమారుడు అరవింద్ ఎస్ఐగా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎస్ఐగా ఎంపిక కావడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. తన సోదరుడు ప్రసాద్ కషి వల్లే ఎస్ఐగా ...
Read More »14న విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వప్రేమ మఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము నిర్వహిస్తున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకులు కర్మయోగి నారాయణ జిజ్ఞాసు తెలిపారు. నగర శివారులోని నాగారం ఓం గురుకుల ఆశ్రమంలో యాగము జరుగుతుందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు, వైదిక ధర్మ రక్షణ కొరకు యాగం తలపెట్టినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Read More »ఆసుపత్రి తనిఖీ
రెంజల్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఎంపీపీ లోలపు రజినీ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొందరు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆమె వెంట మాజీ ఎంపీటీసీ కిషోర్ ఉన్నారు.
Read More »ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది
నిజాంసాగర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ మున్సిపల్ పరిధిలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసేందుకు అన్ని రకాలుగా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ...
Read More »పొట్టకూటి కోసం వస్తే..ప్రాణమే పోయింది
నందిపేట్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం కేంద్రంలోని రాజ్నగర్ దుబ్బలో ఇంటి పైకప్పు కూలడంతో దినసరి కూలి కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం… జీవనోపాధి కోసం ప్రకాశం జిల్లా కేసముద్రం మండలం ఎర్రుపాలెం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబం నందిపేట మండల కేంద్రానికి శుక్రవారం రాత్రి వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలింది. దీంతో అంజయ్య కుమార్తె ...
Read More »రూ. 19 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ పట్టణంలో రూ. 19 కోట్లతో చేపట్టే పలు అభివద్ధి పనులకు రాష్ట్ర రవాణా, రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. శనివారం ఆయన భీమ్గల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ.19 కోట్లతో భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే పనులు సిసి / బిటి రోడ్లకు, సీసీ మురుగు కాలువలకు పదిహేను కోట్ల రూపాయల అంచనాతో చేపట్టడానికి శంకుస్థాపనలు నిర్వహించారు. ఆరు స్మశాన వాటికలకు కోటి ...
Read More »