నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నందర్చంగా పలు అంశాలపై చర్చించారు. 11 వర్దికల్ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా చర్చించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సి.సి.టి.ఎన్.ఎస్ (కైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్లోని ఎఫ్.ఐ.ఆర్ / కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు. నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్ల వారిగా ...
Read More »Daily Archives: February 22, 2021
నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గ ృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో సోమవారం గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం చేశారు. కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాగ మడుగు ...
Read More »ఫోన్ ఇన్లో 38, ప్రజావాణిలో 58 ఫిర్యాదులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 38 ఫిర్యాదులను కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్ర మోహన్ రెడ్డి స్వీకరించారు. అలాగే ప్రజావాణి ద్వారా 58 దరఖాస్తులు స్వీకరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా అందినవాటిలో రెవిన్యూ 18, జిల్లా పంచాయితీ కార్యాలయం 13, జిల్లా లీడ్ బ్యాంక్ 2, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖకు ఒక్కొక్క ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా అందినవాటిలో రెవిన్యూ 38, జిల్లా ...
Read More »సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి 26 వార్డ్ లో సోమవారం మున్సిపల్ నిధులు రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు. వార్డులోని అన్ని కాలనిలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి 100 శాతం అభివృద్ధి కృషి చేస్తానని వార్డు కౌన్సిలర్ హన్మండ్ల మానస సురేష్ తెలిపారు. వార్డ్ సమస్యను చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ...
Read More »ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఆహార వ్యవస్థను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 25 ఫిబ్రవరిన జరిగే సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు కోరారు. కోటార్మూర్ గ్రామంలో దేవంగా సంఘములో బీడీ కార్మికుల సమావేశం ...
Read More »వసతి గృహాల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
డిచ్పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర మరియు బాలికల హాస్టల్స్ను చీఫ్ వార్డెన్ డా. జమీల్ అహ్మద్ నేతృత్వంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ సోమవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రధానాచార్యులు హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవసిందిగా సూచించారు. హాస్టల్ గదులలో పరిశుభ్రత మరియు నిర్ణీత దూరంతో మెలగడం, పరిసర ప్రదేశాల్లో భౌతిక దూరంతో సంచరించడం మరియు శానిటైజేషన్ చేయడం, ప్రతి ...
Read More »ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు
బోధన్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ మండలం సాలూర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగ కొనసాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభత్వాలు తీసుకుంటున్నారని మాజీ రైతు బంధు కో ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమేర్ బోధన్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి దేశంలో లేని అనేక సంక్షేమ ...
Read More »టిఎస్ ఐ-పాస్ అనుమతులకు సరైన సలహాలివ్వండి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్.ఇన్. టీఎస్ ఐపాస్ అనుమతుల కోసం వచ్చే ఔత్సాహికులకు సరైన అవగాహనతో సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ , టీఎస్ ఐపాస్ పై సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు సరైన దిశ- నిర్దేశం చేయడంతోపాటు, వీలైనంత ...
Read More »స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు మట్టిలో మాణిక్యం, స్వతంత్ర సమరయోధుడు, నిజాం రజాకార్లను ఇందూరు గడ్డ నుండి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఉద్యమకారుడు, దేశ భక్తి, ధర్మ నిష్టను ఆచరణలో చూపిన పుణ్య మూర్తి అంబటి శంకర్ (95) ఆదివారం సాయంత్రం స్వర్గస్తుయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం, కోటగల్లి వాస్తవ్యులు అంబటి శంకర్ చిన్ననాటినుంచే దేశభక్తి, ధర్మనిష్ట కలిగి ఆర్యసమాజంలో క్రియాశీల సభ్యునిగా పనిచేశారు. వృద్దాప్యంలో సైతం చిన్నారులను చేరదీసి దేశనాయకుల కథలు, ...
Read More »