కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం పుస్తకం ప్రతిఒక్క వినియోగదారుడి చేతికి ఆయుధమని, అందరికి అర్ధమయ్యే విధంగా ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు.
చట్టాన్ని ప్రతిఒక్క వినియోగదారుడు తెలుసుకుని రక్షణ కలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కో-కన్వీనర్ు తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్, కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమృత రాజేందర్, బసగల్ల రమేష్, ఉపాధ్యక్షుడు తాటి ప్రశాంత్, సహాయ కార్యదర్శి చిన్నబీర సంతోష్ తో పాటు సలహాదారుడు గుర్రా ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021