కామారెడ్డి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన రామారెడ్డి ఎంఆర్వో బాబా షరూఫుద్దీన్ని ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. పదవి విరమణ ప్రతి ఒక్క అధికారికి సహజమని, రామారెడ్డి మండల ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ఎమ్మార్వోను అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ లలిత, ఆర్ఐ వేణు, ఆర్టిఐ ప్రతినిధులు, మండల అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల ఉపాధ్యక్షుడు భవాని పేట సుమన్, మండల కార్యదర్శి భవాని పేట నితిన్, మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నవీన్, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021