కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగత కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మహా సభల భ్రోచర్ విడుదల చేశారు. రాష్ట్ర మహసభలు 6-7 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుందని, మొట్ట మొదటి సారిగా కామారెడ్డిలో రాష్ట్ర మహా సభలు కావునా రాష్ట్ర నలుమూలల నుంచి విధ్యార్థి పరిషత్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిలు విధ్యా రంగ సమస్యలు పలు ఆంశాలపై తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు.
Read More »పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, గొర్రెలు మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బీబీపేట మండలం తుజల్ పూర్ లో గొర్రెలు, మేకలకు పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిడిలు చెల్లించిన లబ్ధిదారులకు రెండో విడతలో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు వ్యవసాయంతో పాటు ...
Read More »ఫుట్ బాల్ కు కేరాఫ్ అడ్రస్ కేర్ ఫుట్బాల్ అకాడమీ
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 13 కేర్ ఫుట్బాల్ అకాడమీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ముఖ్యఅతిథిగా అడిషనల్ డిసిపి అరవింద్ బాబు పాల్గొని ఫుట్బాల్ ఆట ప్రోత్సహిస్తున్న కేర్ ఫుట్బాల్ అకాడమి నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా కోచ్ నాగరాజు తన జీవితాన్ని మొత్తం ఫుట్బాల్కు అంకితం చేసి ఫుట్బాల్ ప్లేయర్ లను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆటలు ఆడిన ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించారని ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్గల్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్తానం వారు ఏర్పాటు ...
Read More »శుక్రవారం ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి
మోపాల్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇందూరు తిరుమల ఆలయంలో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మా పల్లె చారిటబుల్ ట్రస్టు నర్సింగ్పల్లి వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ గాయకుల చేత సంగీత కచేరి ఉదయం నుండి ప్రారంభమవుతుందని, ఉదయం 8 గంటలకు ఆలయంలో రెండు ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖ సినీ నిర్మాత మరియు ఆలయ ట్రస్టు చైర్మన్ ...
Read More »5 నుంచి పిజి పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్లాగ్ మరియు మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు జనవరి 5 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ విభాగాధిపతులతో మంగళవారం ఉదయం పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటీవ్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎం.సి.ఎ., ...
Read More »మాస్క్లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే
హైదరాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కరోనా టెస్టింగ్ కోసం 2 వేల ల్యాబ్లు ...
Read More »బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి
ఆర్మూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నర్సింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆర్మూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు మేలు చేస్తుందని వారి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ...
Read More »పిఎం మోడీతో జగన్ బేటీ…
– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు – ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్, ...
Read More »ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా లోకల్ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్, కోఆపరేటివ్ శాఖ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టెంటు, డయాస్, పబ్లిక్ ...
Read More »పరీక్ష కేంద్రం తనిఖీ
భీమ్గల్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో తతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం భీమ్గల్ నలంద డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ కనకయ్య, జాయింట్ డైరెక్టర్ రాం బాబు తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల్లో వైరస్ ప్రబలకుండ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా యాజమాన్యాలు ఏవిధమైన ఏర్పాట్లు ...
Read More »పనుల్లో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపివేస్తాం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కౌలాస్ నాలా, నిజాంసాగర్ ప్రాజెక్ట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ బన్సీలాల్, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఎ.ఈ.శ్రీనివాస్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అలాగే నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో రైతు వేదిక భవన నిర్మాణం పనులను కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి ...
Read More »ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న పంట వివరాలను, ఇళ్ల వివరాలను, రోడ్ల వివరాలను అధికారులు సేకరించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శుక్రవారం బిచ్కుంద మండలం కుర్ల, సెట్టూర్ గ్రామాలలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పెసర పంటలు జిల్లా కలెక్టర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండేతో కలిసి పరిశీలించారు. అనంతరం బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ...
Read More »నెలాఖరు వరకు పూర్తిచేయాలి
ధర్పల్లి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్ గ్రామంలో పల్లె ప్రగతి పనులు నెల ఆఖరి వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా ఓనాజిపేట్ గ్రామంలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనం, హరిత హారం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు చాలా బాగున్నాయని అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే మెయింటైన్ చేయాలని, గ్రామంలో కొబ్బరి, పగోడా ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గుర్రపు సాయిలుకి 1 లక్ష 50 వేలు, జక్రాన్ పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్కి 13 వేల చెక్కు అందజేశారు. డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గంగ మల్లుకి 10 వేలు మండల అధ్యక్షుడు ...
Read More »విలేజ్ పార్కు ఎంతో ముఖ్యం
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం, తాడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా తాడెం గ్రామంలో విలేజ్ పార్కు స్థలం, నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి విలేజ్ పార్క్ ఎంతో ముఖ్యమని, విలేజ్ పార్క్ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ల్యాండ్ గ్రామపంచాయతీ కంట్రోల్లో ఉంటుందన్నారు. పార్కు వెలుపల ఉపాధి కోసం ...
Read More »హిందూ పండుగలపై ఆంక్షలు తగదు – న్యాయవాది సురేందర్ రెడ్డి
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...
Read More »భక్తి శ్రద్దలతో పాదయాత్ర
నిజాంసాగర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో గల 161 జాతీయ రహదారి ప్రక్కన అంజనాద్రి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం నిర్వహించే అంజనాద్రి పాదయాత్ర బ్రహ్మణపల్లి గ్రామం నుండి మొదలైంది. పాదయాత్ర బ్రహ్మణపల్లి, అంజనాద్రి మందిరం, మాసన్ పల్లి, ఆరేపల్లి మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సిద్ది వినాయక మందిరానికి చేరుకుంది. భక్తుల భజన భక్తి పాటలతో అంజనాద్రి పాదయాత్ర మారుమోగింది. గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అవాంతరాలు ...
Read More »జన్మదినం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్ బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో సోమవారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని ...
Read More »నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్ కలెక్టరేట్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ళ ఇద్దరు చిన్నారులపై గత 15 రోజులుగా అదే గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వృద్ధుడు నారాయణ అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా చిన్నారులకు చాక్లెట్లు ఇస్తూ వెంట తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగడుతూ ఇంట్లో చెప్పద్దని చిన్నారులను భయపెడుతూ వచ్చాడు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు అరా తీయగా విషయం ...
Read More »