నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, పలువురు అధికారులు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ...
Read More »కవులకు ముఖ్య సూచన…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3న స్వతంత్ర స్ఫూర్తి పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని స్వతంత్ర భారత అమృతోత్సవ కార్యక్రమాలు 75 వారాలపాటు నిర్వహిస్తున్న నేపథ్యంతో ...
Read More »ముగిసిన బ్రహ్మోత్సవాలు
మోర్తాడ్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో మోర్తాడ్, కమ్మర్పల్లి, ఎరుగట్ల మండలాలలోని ఆయా గ్రామాల నుండి అనేకమంది భక్తులు పాల్గొని విజయ విజయవంతం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి 12 గంటల తర్వాత రథయాత్ర నిర్వహించారు. రథయాత్రలో అనేక గ్రామాల భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు బుధవారం తెల్లవారుజామున చక్రతీర్థంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ...
Read More »నేడు మోర్తాడ్లో రథోత్సవం
మోర్తాడ్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించి వారం రోజుల నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మోర్తాడ్లో మంగళవారం అర్ధరాత్రి రథోత్సవం జరగనుంది. జాతరకు చుట్టు పక్కల మండలాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం వారికి కావలసిన సౌకర్యాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్తులు వారికి సౌకర్యాలు కల్పించారు. ...
Read More »1న గో మహాగర్జన విజయవంతం చేయండి
బీర్కూర్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ ఒకటో తేదీన భాగ్యనగరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన గో మహాగర్జన బహిరంగ సభ విజయవంతం చేయాలని హనుమాన్ దీక్ష మాల ధరించిన గురు స్వాములు సూచించారు. ఆదివారం నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో నిర్వహించిన హనుమాన్ దీక్ష మాల ధారణ స్వాముల మండల బిక్ష మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గో మహాగర్జన బహిరంగ సభ ప్రాముఖ్యతను వివరించి మాల ధరించిన స్వాములందరూ ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో హాజరై విజయవంతం ...
Read More »అయ్యప్పస్వామికి విశేష పూజలు
భీమ్గల్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ శ్రీ అయ్యప్పస్వామి మందిరంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త శ్రీ అయ్యప్ప స్వామి పుట్టిన రోజు 28వ తేదీ ఆదివారం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడతాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. కావున భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
Read More »స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత అందరిదీ
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని దానిని నిబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మరియు సెషన్స్ జడ్జి సాయి రమాదేవి అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల ఆజాదీ కా అమృత్ మహోత్సవములో భాగంగా బుధవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఫ్రీడమ్ టూ-కే రన్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, జిల్లా అటవీ అధికారి సునీల్తో ...
Read More »కామారెడ్డిలో మహాశివరాత్రి జాగరణ
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలిపారు. జాగరణ కార్యక్రమంలో భాగంగా జెపిఎన్ రోడ్డులో మానస సరోవరం సెట్టింగ్ మరియు శివ లింగం ఏర్పాటు చేసి 8 గంటల నుండి పూజా కార్యక్రమాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 12.14 నిమిషాలకు లింగోద్భవ కార్యక్రమం ...
Read More »జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గ ృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని గరళకంఠున్ని మంత్రి వేముల ప్రార్థించారు.
Read More »గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…?
మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ప్రసాద వితరణలో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బున్న ...
Read More »మానస గణేష్కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీలోని మామిడిపల్లికి చెందిన మానస స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్ నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్లో జరిగిన అమ్మానాన్న ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్రస్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయులు, ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, డాక్టర్ నాగరాజు చేతులమీదుగా అవార్డు ప్రదానం జరిగింది. కోవిడ్ వల్ల రాష్ట్రమంతటా లాక్డౌన్ సమయంలో వలసకూలీలకు నిరుపేదలకు నిత్య ...
Read More »లింబాద్రిలో భక్తుల రద్దీ
భీమ్గల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...
Read More »ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే…
ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో శివాజీ ఆ సైనికాధికారిని మందలిస్తూ ఇలా అన్నాడు. నా తల్లి కూడా మీ అంత అందమైనదైవుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. అందుకే శివాజీ అంటే కులమతాలతో తేడా లేకుండా ఎంతగానో అభిమానించేవారు. భారతదేశంలో ఎందరో రాజు పాలించినప్పటికీ శివాజీకి వున్న గొప్పతనం విభిన్నమైనది. శివాజీ వ్యక్తిత్వం అందరికి ఆదర్శం.
Read More »ఆర్మూర్లో ఛత్రపతి శివాజీ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జయంతిని ఆర్మూర్ లోని శివాజీ చౌక్ (గోల్ బంగ్లా) వద్ద ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ...
Read More »మనుషులు చెట్టంత ఎదగాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనిషి చెట్టులాగా పరోపకార భావనతో ఎదగాలని చెట్టంత మనుషులుగా కావాలని జిల్లా కేంద్ర గ్రంథాయం అధికారి తారకం అన్నారు. ఆదివారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో సియం కేసిఆర్ జన్మదినం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ‘‘కోటి వృక్షార్చన’’ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల సంఘం అద్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ హరితహారాన్ని స్వప్నించి ...
Read More »నిజామాబాద్లో సాంస్కృతిక పోటీలు
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు కోటి వృక్ష అర్చన (హరితహారం) అంశంపై కవి సమ్మేళనం, ఉపన్యాస పోటీ, వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం, పాటల పోటీ నిర్వహిస్తున్నట్లు హరిదా రచయిత సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కవి సమ్మేళనం ఫిబ్రవరి 14 ఆదివారం ...
Read More »7న ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం
నిజామాబాద్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు ఆర్యసమాజము ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యోగ, ధ్యానం, సంధ్య, యజ్ఞం, ఆధ్యాత్మిక చింతన ప్రవచనములు, ఆధ్యాత్మిక చింతన మననం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. sa శిబిరంలో పాల్గొనదచిన వారు పూర్తిగా మౌనం పాటించాలని, అప్పుడే దివ్యమైన అనుభూతిని పొందగలుగుతారన్నారు. అలాగే సెల్ఫోన్ రోజంతా స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుందన్నారు. ...
Read More »పీడితుల పక్షాన కలమెత్తిన వ్యక్తి మొయినుద్దీన్
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెలంగాణ జాగృతి నిజామాబాద్ ఆద్వర్యంలో మొయినుద్దిన్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4న జన్మించారని, తాను కమ్యూనిస్టు ఉద్యమానికి జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రగతిశీల బావాలతో పీడీతుల పక్షాన కలమెత్తి, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ ఆపర్ణ, జిల్లా కో కన్వీనర్ పులి జైపాల్, జిల్లా అధికార ...
Read More »శోభాయమానంగా శోభాయాత్ర….
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామాజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ నామ సంకీర్తన శోభయాత్ర కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ నుండి ప్రారంభమై పట్టణంలోని పుర వీధుల గుండా నిర్వహించారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు శిశుమందిర్ లో జరిగిన సభలో ముఖ్య అధితిగా విచ్చేసిన సోమయప్ప స్వామిజి మాట్లాడుతూ తరతరాల నుండి కలలు కన్న భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి హిందూ బంధువు దగ్గరకి రామ భక్తులు వెళ్లి నిధి సేకరించడం ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్గల్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్తానం వారు ఏర్పాటు ...
Read More »