కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...
Read More »పేదలకు జనం పాట కళాకారుల చేయూత
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ‘జనం పాట’ కళాకారుల ఆధ్వర్యంలో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం కొరకు అలమటిస్తున్న పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘జనం పాట’ వ్యవస్థాపకుడు రాంపూర్ సాయి మాట్లాడుతూ కొరొనా లాక్ డౌన్ నేపధ్యంలో ఆహారం కొరకు అలమటిస్తున్న వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సాటి కళాకారుల సహాయ సహకారాలతో స్వచ్చంధంగా ఆదర్శ్ నగర్, హమాల్ వాడీ, నాందేవాడ, ఆర్యనగర్ తదితర ప్రాంతాల్లో ...
Read More »వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం
నిజామాబాద్ రూరల్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరిచారు. పలువురు ప్రముఖులు దైవ దర్శనం చేసుకున్నారు. భీంగల్ మండల కేంద్రంలోని పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉత్తర ద్వారా దైవ దర్శనం చేసుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాదు ఉత్తర తిరుపతి ఆలయంలో జెడ్పి చైర్మెన్ విఠల్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే మోపాల్ మండలంలోని ...
Read More »ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు
ఎడపల్లి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెరాస మండల అధ్యక్షుడు శ్రీరామ్, మాజీ సర్పంచ్ దశరథ్, సొసైటీ డైరెక్టర్ శేఖర్, రాజు ఆధ్వర్యంలో ఎడపల్లి, జానకంపేట్ గ్రామాల్లోని తెరాస పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్కట్ చేసి పంచిపెట్టారు. అధేవిదంగా ఎంపీపీ రజిత యాదవ్, మాజీ సర్పంచ్ లతశ్రీ, జైతపూర్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు ,పెన్సిళ్లు, బిస్కెట్లు అన్ని ...
Read More »ఓటరు జాబితాలో లోపాలు ఉండకూడదు
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో డూప్లికేట్, లాజిక్ ఎర్రర్స్, డబల్ నేమ్స్ ఒక్కటి కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఓటర్ నమోదు ప్రత్యేక శిబిరం పురస్కరించుకొని మొదటిరోజు శనివారం ఉదయం నగరంలోని అర్సపల్లి, హబీబ్ నగర్, నాగారం, మాలపల్లిలో పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్దేశించిన ప్రకారం జిల్లాలో మార్చి 2, 3 తేదీలలో రెండు ...
Read More »ఘనంగా ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ డే
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులో మల్లారం వద్దగల మేఘన దంత కళాశాలలో బుధవారం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ డే, 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రోడ్డు ట్రాన్స్పోర్టు అథారిటి, మేఘన దంత కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకట్రెడ్డి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని అన్నారు. కారు యజమానులు ...
Read More »ఇందూరు తిరుమల క్షేత్రానికి ఉచిత బస్సు
నిజామాబాద్ కల్చరల్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశేష ఏకాంత సేవలో పాల్గొనె భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ నగరం నుండి ఇందూరు తిరుమల క్షేత్రం నర్సింగ్పల్లికి ఉచిత బస్సు ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. విశేష ఏకాంత సేవలో పాల్గొనే భక్తులకు ప్రతి శనివారం సాయంత్రం 6:30. గంటలకు వినాయకుల బావి దగ్గర, త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ ఎదురుగా ప్రెసిడెన్సీ పాఠశాలకు చెందిన బస్సు ఉంటుందన్నారు. భక్తులను తీసుకుని 7 గంటలకు వినాయక్ నగర్ నుండి నర్సింగ్పల్లికి ...
Read More »కూర్న పల్లి లో కంటి వెలుగు
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం గురువారంతో నాలుగో రోజుకు చేరింది. ఇప్పటివరకు కంటివెలుగు కార్యక్రమంలో 700లకు పైగా గ్రామస్తులు కంటి పరీక్షలు చేసుకున్నట్లుగా గ్రామసర్పంచి దుబ్బాక సావిత్రి రవీందర్ గౌడ్ తెలిపారు. 50 మందికి పైగా గ్రామస్తులకు కంటి అద్దాలు అందించామని, ఇంకా వంద మందికి అద్దాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామస్తులనుండి మంచి స్పందన వస్తుందని, ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ...
Read More »మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని కులాస్పూర్ గ్రామానికి చెందిన మాల, మాదిగ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. కులాస్పూర్ గ్రామంలో మాల, మాదిగలకు చెందిన సుమారు 400 మంది ఓటర్లున్నారని, 50 సంవత్సరాల నుంచి తమకులాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కలగలేదని విన్నవించినప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని వారు వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ...
Read More »బస్సు ఢీకొని వివాహిత మృతి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామ శివారులో బస్సు ఢీకొని గ్రామానికి చెందిన మారెమ్మ అనే వివాహిత మృతి చెందింది. నిజామాబాద్ నుంచి జన్నేపల్లి వెళుతున్న బస్సు ఏపి 28 జెడ్ 1930 డిపో 2, అతివేగంగా వచ్చి మోటారుసైకిల్పై వెళుతున్న దంపతులను ఢీకొనడంతో మారెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా బస్సు డ్రైవర్ వేణుగౌడ్పై కేసు నమోదుచేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు.
Read More »అభ్యర్థులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి
కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు అభిషేక్ కృస్ణ సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి సందేహాలున్నా ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరిశీలకులను సంప్రదించాలని, వాట్సాప్, ఫోన్ నెంబరు ద్వారా సైతం సంప్రదించవచ్చని చెప్పారు. ఈవిఎం, వీవీప్యాట్ యంత్రాల రెండవ ర్యాండమైజేషన్లో ...
Read More »నీలాలో పోలీసుల కవాతు
రెంజల్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని నీలా, పేపర్మిల్ గ్రామాల్లో శుక్రవారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా ఈ ర్యాలీని బిఎస్ఎఫ్ జవాన్లతో నిర్వహించారు. ఈ కవాతులో ఏసిపి రఘు, సిఐ షకీర్ అలీ, ఎస్ఐ శంకర్ పాల్గొన్నారు.
Read More »విద్యార్థులకు బహుమతుల ప్రదానం
రెంజల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు నవీన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిఖిల్, ప్రవీణ్, సాయినాథ్, గంగాప్రసాద్ తదితరులున్నారు.
Read More »అభివృద్దికి ఓటు వేయండి
ఆర్మూర్ సభలో ఆపద్దర్మ సిఎం కెసిఆర్ నిజామాబాద్ టౌన్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేసి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల్ని కోరారు. గురువారం ఆర్మూర్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అధికారం కోసం మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని, గతంలో ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణ పట్ల ...
Read More »ఎన్నికల ప్రచారంలో భూపతిరెడ్డి దంపతులు
నిజామాబాద్ టౌన్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుండారం, జలాల్పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్డుషో నిర్వహించి తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. అదేవిధంగా భూపతిరెడ్డి సతీమణి వినోదిని సుద్దులం, మైలారం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కొరట్పల్లి, కెపి తండా గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు.
Read More »బిఎల్ఎఫ్ అభ్యర్థిగా నూర్జహాన్ నామినేషన్
నిజామాబాద్ టౌన్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఎల్ఎఫ్ రూరల్ అభ్యర్థిగా నూర్జహాన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా బిఎల్ఎఫ్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు రాజారావు, రమ మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడంలో తెరాస పూర్తిగా విపలమైందన్నారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. బిఎల్ఎఫ్ అభ్యర్థిగా నూర్జహాన్ను రూరల్ నుంచి గెలిపించాలని కోరారు. బిఎల్ఎఫ్ ద్వారానే ...
Read More »సొంత గ్రామంలో పర్యటించిన ఆనంద్రెడ్డి
నిజామాబాద్ టౌన్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ రూరల్ అభ్యర్థి ఆనంద్రెడ్డి సోమవారం తన స్వంత గ్రామమైన కేశ్పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశ్పల్లిలోని కేశవనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కేశ్పల్లి గంగారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. తన సొంత గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానన్నారు. అనంతరం యువకులు నిర్వహించిన ...
Read More »ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత బిజి బిజి
నిజామాబాద్ టౌన్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్ ఎంపిటిసి పద్మజ మోహన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎంపిటిసి నాగమణి, సాయారెడ్డి, ఎంపిటిసి సాయన్న తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందిపేట గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆర్మూర్ ...
Read More »నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూపతిరెడ్డి నామినేషన్
నిజామాబాద్ టౌన్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ భూపతిరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, రూరల్ నియోజకవర్గంలో తాను గెలవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా అన్నారు. మహాకూటమిపై తెరాస నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, గతంలో మహాకూటమిలో తెరాస నాయకులు ఉన్న సంగతి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
Read More »వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస పార్టీ నాయకులు కామారెడ్డి శివారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఛైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు జూకంటి ప్రభాకర్రెడ్డి ఆద్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పట్టణ తెరాస నాయకుడు సంగమేశ్వర్, మైనార్టీ నాయకులు షౌకత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. ...
Read More »