నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే కొంత పాజిటివ్గా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్గా ప్రమోషన్తో పాటు బదిలీపై హైదరాబాద్ వెళుతున్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీరాములుకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిపివోకు జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ...
Read More »గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…?
మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ప్రసాద వితరణలో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బున్న ...
Read More »ఎండాకాలంలో త్రాగునీటి సమస్య రాకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్క హేబిటేషన్లో కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి వేసవికాలం ప్రారంభం అవుతుందని తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ టీం విజయవంతంగా అన్ని ...
Read More »ఎమ్మెల్యే బగ్గీ టూర్
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మునిసిపల్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ వాహనాన్ని (బగ్గీ) ని ప్రారంభించారు. అనంతరం నగరంలో బగ్గీని స్వయంగా నడుపుకుంటు వెళ్లి రోజువారీ పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనులు భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు రాత్రి వేళల్లో అధికారులతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే. అదే విధంగా నగరంలో ప్లాంటేషన్, సెంటర్ మీడియంలు, నిరంతరం వివిధ అభివృద్ధి పనులు ...
Read More »కలెక్టర్ సహకారంతోనే ఒత్తిడి లేని విధులు
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక శాఖ సంచాలకులుగా పదోన్నతిపై వెళుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీరాములును జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర అధికారులు శాలువాతో సత్కరించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక నిధుల సమావేశం అనంతరం కలెక్టర్ ఆయనను సత్కరించిన సందర్బంగా సిపిఓ మాట్లాడారు. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సలహాలు అందిస్తూ పూర్తి సహకారం అందించాలని తద్వారానే తాను ఒత్తిడిలేని విధులను నిర్వహించ గలిగానని అందుకు ఎల్లప్పుడు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఇంతకాలంగా తనకు ...
Read More »మే చివరికల్లా పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు మే చివరికల్లా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరములో సిడిపి, ఎస్డిపి, ఎంపి లాడ్స్, రెండు పడక గదుల ఇళ్ళు, ఇతర నిర్మాణ పనులపై పి ఆర్., ఆర్అండ్బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్ మార్చ్ 31 వరకు ...
Read More »నేరాల శాతం తగ్గించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నందర్చంగా పలు అంశాలపై చర్చించారు. 11 వర్దికల్ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా చర్చించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సి.సి.టి.ఎన్.ఎస్ (కైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్లోని ఎఫ్.ఐ.ఆర్ / కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు. నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్ల వారిగా ...
Read More »టిఎస్ ఐ-పాస్ అనుమతులకు సరైన సలహాలివ్వండి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్.ఇన్. టీఎస్ ఐపాస్ అనుమతుల కోసం వచ్చే ఔత్సాహికులకు సరైన అవగాహనతో సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ , టీఎస్ ఐపాస్ పై సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు సరైన దిశ- నిర్దేశం చేయడంతోపాటు, వీలైనంత ...
Read More »స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు మట్టిలో మాణిక్యం, స్వతంత్ర సమరయోధుడు, నిజాం రజాకార్లను ఇందూరు గడ్డ నుండి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఉద్యమకారుడు, దేశ భక్తి, ధర్మ నిష్టను ఆచరణలో చూపిన పుణ్య మూర్తి అంబటి శంకర్ (95) ఆదివారం సాయంత్రం స్వర్గస్తుయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం, కోటగల్లి వాస్తవ్యులు అంబటి శంకర్ చిన్ననాటినుంచే దేశభక్తి, ధర్మనిష్ట కలిగి ఆర్యసమాజంలో క్రియాశీల సభ్యునిగా పనిచేశారు. వృద్దాప్యంలో సైతం చిన్నారులను చేరదీసి దేశనాయకుల కథలు, ...
Read More »నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి లక్ష్యాన్ని పూర్తి చేయుటకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈనెల 22 వరకు 30 చెక్ డ్యామ్లకు సంబంధించి ప్రోగ్రెస్ ...
Read More »ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హై కోర్ట్ అడ్వకేట్లు వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ నుండి ఎన్టిఆర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో లేవని రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యం కాకుండా రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోందని ఆందోళన ...
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు తమ విధుల్లో భాగంగా ప్రజలతో మమేకమై ఉండే ఫ్రంట్లైన్ వారియర్స్ తప్పనిసరిగా తమ రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, జిల్లాలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోసు, హరితహారం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఉపాధిహామీ లేబర్ టర్నవుట్ నర్సరీ ...
Read More »21 నుండి డిగ్రీ, పిజి తరగతులు
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్ తరగతులు, పిజి ద్వితీయ సంవత్సరం తరగతులు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పిజి ప్రథమ సంవత్సరం తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. అభ్యర్థులు తప్పకుండా తరగతులకు హాజరు కావాలని అంబర్సింగ్ పేర్కొన్నారు.
Read More »భీమ్గల్ బార్ దక్కించుకున్న బద్దం రాకేశ్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బారుకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం దరఖాస్తు దారుల సమక్షంలో ప్రగతిభవన్ కలెక్టరేట్లో డ్రా తీశారు. ఇందులో బద్దం రాకేశ్ విజేతగా నిలిచి బార్ దక్కించుకున్నారు. మిగిలిన నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మునిసిపాలిటి, ఆర్మూర్ మునిసిపాలిటీలో నోటీఫై చేయబడిన కొత్త బార్లకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాల ప్రకారం తర్వాత డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ...
Read More »అగ్రశ్రేణి సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ తెలంగాణ గడ్డపై జన్మించిన అగ్రశ్రేణి సామాజిక సంస్కర్త అని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన భాగ్యరెడ్డివర్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూమతంలో సంస్కరణ కోరుకుని, దళిత జాతి అభ్యున్నతికి, దళిత జాతి చదువులకు, దళిత జాతి చైతన్యానికి ఎంతో శ్రమించిన వ్యక్తి అని నివాళులు ...
Read More »2021-22 సంవత్సరానికి పిఎల్పికి ఆమోదం
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ ఆధ్వర్యంలో ముద్రించిన పొటెన్షియల్ లింక్డు క్రెడిట్ ప్లాన్కు పిఎల్పి చైర్మన్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కలెక్టర్ను గురువారం ఆయన చాంబర్లో కలిసి ఈ నోట్స్కు ఆమోదింప చేసుకుని లాంచింగ్ చేయించారు. పిఎల్పి ఆధారంగా జిల్లాలో ఆయా ప్రాంతాలలో సాగుచేసే పంటలకు, అవసరాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని ...
Read More »18న ఒక బార్కు మాత్రమే డ్రా
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, టిఎస్ హైదరాబాద్ ఆదేశాల మేరకు నిజామాబాద్ కార్పోరేషన్ 7, ఆర్మూర్ 1, బోధన్ 3 బార్లకు డ్రా నిలిపివేసినట్టు జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం భీంగల్ మున్సిపాలిటీ లో గల ఒక్క బారుకు మాత్రమే డ్రా జరుపబడుతుందని, ...
Read More »లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. విద్యాసంస్థలు వసతి గృహాల్లో పాత బియ్యం ఏమైనా ...
Read More »న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్న గట్టు వామన్ రావు, గట్టు నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్ తిరిగి వెళ్తున్న కాల్వ చర్ల దగ్గర దారుణంగా హత్య చేయడాన్ని న్యాయవాది పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదులను చంపడం ద్వారా న్యాయం చనిపోలేదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని భావిస్తోందని న్యాయవాది పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదుల హత్యలకు బాధ్యులైన దుండగులను తక్షణమే ...
Read More »మొక్కలు నాటి జన్మదిన బహుమతిగా ఇవ్వాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి వృక్ష ప్రేమికుడని, మొక్కలన్నా చెట్లన్నా ఆయనకు అమితమైన ఇష్టమని, ఆయన జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి బహుమతిగా అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వేల్పూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటే ...
Read More »