నిజామాబాద్ టౌన్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏజెంట్ల మోసాలకు బలై ఖతర్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని తెలంగాణ జాగృతి ఖతర్ నిర్వాహకురాలు నందిని అబ్బగోని తెలిపారు. ఖతర్లో తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక అష్టకష్టాలు పడుతున్న నిజామబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 20 మంది బాధితుల పరిస్తితి తెలుసుకున్న జాగృతి నాయకులు వారి వద్దకెళ్ళి నిత్యవసర సరుకులు, ఇతరత్రా అందజేశారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ ఏజెంట్ల మోసాలకు బలై ఖతర్లో ఎంతోమంది తెలంగాణవాసులు ...
Read More »గల్ఫ్ బాధితులకు ఎంపీ కవిత ఆపన్న హస్తం.
క్షమాభిక్ష అర్హులందరికీ విమాన టికెట్లు. అందరిని క్షేమంగా ఇంటికి చేరవేయమని జాగృతి శాఖలకు ఆదేశాలు. నిజామాబాద్ టౌన్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కువైట్ దేశంలో అక్రమంగా పర్మిట్ వీసా లేకుండా శిక్షపడ్డ తెలంగాణ కార్మికులకు కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించిన విషయం తెలిసిందే. గల్ప్ జైళ్ళలో మగ్గుతున్న తెలంగాణ కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. కువైట్ ...
Read More »‘బాత్రూంలో నీళ్లు తాగుతున్నా.. మీకు పుణ్యం ఉంటాది కాపాడండి సార్’
నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ దుబాయ్కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో బందీ అయిన ఓ అభాగ్యురాలి ధీనగాథ ఇది. ఆమె సౌదీ నుంచి ఫోన్లో ఆంధ్రజ్యోతితో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె గోడు వింటే ఎవరికైనా కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఆమె ధీనగాథ ఇలా… సౌదీ నుంచి ఫోన్లో హలో సార్, నమస్తే సార్, నా పేరు సుబ్బలక్ష్మి సార్. మాది మాధవరం-1, గ్రామం, సిద్ధవటం మండలం, కడప జిల్లా. ...
Read More »చైనాకు పోటీ: అమెరికా, భారత్ ‘ఐపీఈసీ’
వాషింగ్టన్: దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)కు గట్టి పోటీ నిచ్చేందుకు అమెరికా న్యూ సిల్క్ రోడ్(ఎన్ఎస్ఆర్), ఇండో-పసిఫిక్ కారిడార్(ఐపీఈసీ) ప్రాజెక్టులను పునరుద్ధరించనుంది. అయితే, దీని వల్ల భారత్కు ఏంటి ప్రయోజనం?. 2011లో భారత్లో పర్యటించిన అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఎన్ఎస్ఆర్, ఐపీఈసీలపై చెన్నైలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల కేంద్రంగా ఈ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆమె ...
Read More »వారిని దేశంలో అడుగుపెట్టనీయకండి..
వాషింగ్టన్: అమెరికాలో ముస్లిం జనాభా పెరిగిపోతున్నదని, అందువల్ల మెజరీటి ముస్లిం దేశాల వారికి వీసాలు ఇవ్వడం ఆపేసి, అధ్యక్షుడు ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నాడని డబ్ల్యూఎమ్డి న్యూస్ ఎడిటర్ లీ హోమాన్, అధ్యక్షుడు ట్రంప్ను అభినందించారు. ముస్లిం జనాభా పెరిగితే, అమెరికాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని విషయాలను వివరించేందుకు ఆయన ‘స్టీల్త్ ఇన్వెషన్ ముస్లిం కన్క్వేస్ట్ త్రో ఇమ్మిగ్రేషన్ అండ్ ది రిసెటిల్మెంట్ జిహద్’ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. అమెరికాలో మొత్తం 32,00ల వరకు మసీదులున్నాయని, వాటిలో చాలావాటికి సౌదీ అరేబియా ...
Read More »కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఎంపి కవిత భేటీ
పసుపు బోర్డు ఏర్పాటును వేగవంతం చేయాలి పసుపు దిగుమతులపై నిషేధం విధించాలి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల సహాయ మంత్రి నిర్మల సీతారామన్తో సమావేశమయ్యారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మంత్రికి పసుపు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమైన మూడు అంశాలను ప్రస్తావించిన కవిత వాటి అమలు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. పసుపు రైతులు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారని, బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీతో సమావేశమైన రెండు ...
Read More »భర్తతో భార్య గొడవ.. వైద్యులకు దిమ్మతిరిగే షాక్..
కొలంబియా: భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ, అనంతర పరిణామం డాక్టర్లనే కాకుండా ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 28 ఏళ్ల వయసున్న ఓ మహిళ అక్షరాలా 5 లక్షల 78 వేల రూపాయల(9 వేల అమెకన్ డాలర్లు)ను మింగేసింది. నమ్మడానికి డబ్బేమైనా రుచికరమైన ఆహారమా? అని సందేహం కలిగినా ఇది అక్షరసత్యం. అమెరికాలోని కొలంబియా నగరానికి చెందిన సండ్రా మిలేనా ఆల్మెడా అనే యువతి, ఆమె భర్త పనామా వెళ్లి అక్కడే స్థిరపడాలని భావించారు. కానీ అనుకోకుండా జరిగిన గొడవ వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇంట్లో ...
Read More »మహిళపై లైంగికదాడి చేయబోయాడు..చివరికి దొరికిపోయి
దుబాయ్: నేపాల్కు చెందిన ఒక మహిళ(42) ఇటీవల దుబాయ్ వెళ్లింది. అక్కడ ఒక భారతీయుడి ఇంట్లో పనిమనిషిగా చేరింది. తన భర్త కూడా అక్కడికి దగ్గర్లోనే పనిచేస్తుంటాడు. వారికి ఆ భారతీయ యజమాని తన ఇంట్లోనే వారుండేందుకు ఒక గది కూడా ఇచ్చాడు. భర్త స్నేహితుడు అప్పుడప్పుడూ వారింటికి వచ్చి వెళ్లేవాడు. అతడు కూడా ఆ భారతీయ యజమాని ఆఫీసులో డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. అతడు కూడా నేపాల్కే చెందిన వ్యక్తి(29) కావడంతో అతడికి ఆమెతో పరిచయం ఏర్పడింది. యజమానిని ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అతడు రోజు ...
Read More »భారతీయులకు డబ్బులెలా వచ్చాయ్?
ఇక్కడున్న అమెరికన్లందరికీ ఏమైంది? భారత గుంపు అమెరికాను ఆక్రమిస్తోంది ఓహియోలో అమెరికన్ వీడియో! అమెరికాలో భారతీయులకు మరో ఆందోళనకర పరిణామం. ఓ అమెరికన్.. ‘‘ఇక్కడ భారతీయులు తమ ఉద్యోగులను కొల్లగొట్టేస్తున్నారని’’ పేర్కొంటూ.. ఓ పార్కులో ఉన్న భారతీయ కుటుంబాలను రహస్యంగా వీడియో తీసి ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వెలుగులోకి రావడం.. ఇందులో అతను భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం.. తదితర పరిణామాలు ఇక్కడున్న భారతీయులను మరింత ఆందోళనలోకి నెట్టేశాయు. గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్న భారతీయులపై విద్వేష ...
Read More »ప్రతిభావంతుల వలసలకు ఓకే!
మెరిట్ ఆధారిత వలస విధానం ⇒ కెనడా, ఆస్ట్రేలియా తరహాలో అమలు ⇒ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి.. కాంగ్రెస్నుద్దేశించి తొలి ప్రసంగం వాషింగ్టన్: వలస విధానంపై పునరాలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతిభ ఆధారిత వలసల విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా భారత్ వంటి దేశాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణులకు మేలు జరుగుతుంది. అధ్యక్షుడిగా కాంగ్రెస్నుద్దేశించి (అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం) మంగళవారం రాత్రి తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ‘కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ...
Read More »ముఖాన్ని కొరికేసిన ముస్లిం వ్యతిరేకి
అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయకముందే.. అంటే గతేడాది నవంబరు 27న ముస్లిం వ్యతిరేక దాడి జరిగింది. ముస్లింలపై విద్వేషంతో రగిలిపోతున్న 35 ఏళ్ల అమెరికన్ ఓ వ్యక్తిని ముఖంపై కొరికేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని సోమవారం అరెస్ట్ చేశారు. వర్జీనియా రాష్ట్రంలోని మెక్లీన్లో ఓ పార్కింగ్ స్థలం వద్ద రాబిన్ మెక్ గ్రీర్ అనే వ్యక్తి 31 ఏళ్ల వ్యక్తి వద్దకు వెళ్లి బెదిరించాడు. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తింది. ...
Read More »మీ దేశానికి పో!
న్యూయార్క్ రైల్లో భారతీయ మహిళకు బెదిరింపు అసభ్యకరమైన భాషలో తిట్టిన ఆఫ్రో-అమెరికన్ భారతీయుల ఇంటి గోడకు విద్వేష పోస్టర్ గోడలపై గుడ్లు విసిరి.. అశుద్ధం రాసి అరాచకం అమెరికాలో భారతీయులకు జాతి వివక్ష పరీక్షలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి! తాజాగా న్యూయార్క్ మెట్రో రైల్లో ఎక్తా దేశాయ్ అనే భారతీయ మహిళ, పక్కనే కూర్చున్న మరో ఏసియన్ ఈ తరహా విద్వేషాన్ని చవి చూశారు. ఆఫీసు పని పూర్తి చేసుకొని రైల్లో ఇంటికి బయల్దేరిన ఎక్తా దేశాయ్పై…స్నేహితుల గుంపుతో వచ్చిన ఒక ఆఫ్రో అమెరికన్ ...
Read More »‘సౌదీ చెర నుంచి మమ్మల్ని విడిపించండి’
సౌదీ: ‘పొట్టకూటి కోసం, అప్పులు తీర్చడం కోసం తండ్రీకొడుకులం సౌదీకి వలస వచ్చాం. నిబంధనల ప్రకారం బాండ్ రాశాం. తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాం. జీతాలకు సంబంధించిన బాకీలు ఇంకా ఇవ్వడం లేదు. తిండి లేక చస్తున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి’.. అంటూ ఓ భారతీయుడు ట్విటర్ వేదికగా భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఓ సిక్కు.. సౌదీ అరేబియాలో తమ పరిస్థితి గురించి భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో వీడియో పంపాడు. పేరు, కంపెనీ వివరాలను వెల్లడించిన ఆ ...
Read More »అమెరికా వీసా బాంబు?
ఉద్యోగులు, విద్యార్థులే ట్రంప్ టార్గెట్ – ‘చట్టబద్ధ వీసా’ల పైనా – అమెరికా అధ్యక్షుడి గురి – వీసా నిబంధనల సమీక్ష, – అమలు తీరుపై తనిఖీలు – కొత్త నిబంధనలతో – ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధం ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, మంచి జీవితం.. కారణమేదైనా తొలి చూపు అమెరికావైపే.. ఎన్నో ఆశలతో అమెరికా వైపు చూసే వారందరి కలలపై ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు వేయనున్నారు. రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్1బీ, ఎల్1, ఎఫ్1 ...
Read More »ట్రంప్పై తిరుగుబాటు.. ప్రత్యేక దేశంగా కాలిఫోర్నియా..!
కాలిఫోర్నియా:మొదటి నుంచి ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న కాలిఫోర్నియా.. అమెరికా నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. వలసదారులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో.. ట్రంప్ విధానాలు నచ్చని వారంతా ఏకమవుతున్నారు. అమెరికా నుంచి విడిపోయేందుకు కాలిఫోర్నియా వాసులు ప్రచారం మొదలెట్టారు. ఈయూ నుంచి బ్రిటన్.. ‘బ్రెగ్జిట్’ పేరుతో విడిపోయిన విధంగా.. అమెరికా నుంచి విడిపోయేందుకు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశంగా అవతరించేందుకు ‘కలెగ్జిట్’ పేరుతో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. గురువారం నుంచే ఈ పిటిషన్పై సంతకాల సేకరణ ...
Read More »ఏసుక్రిస్తుతో ట్రంప్ను పోల్చారు
వాషింగ్టన్: అభిమానం హద్దుమీరితే ఎలా ఉంటుందో అమెరికాలో ఆదివారం స్పష్టంగా తెలిసివచ్చింది. ఒక్క వాఖ్యం.. అమెరికాలో హాట్టాపిక్గా మారింది. క్రిస్టమస్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నేత, రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్, ట్రంప్ చీఫ్ అయిన ప్రీబస్.. ఇచ్చిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డోనాల్డ్ ట్రంప్ను, ఏసుక్రీస్తును పోల్చుతూ ఆయన చేసిన ప్రసంగంపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘‘రెండు వేల ఏళ్ల క్రితం.. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక రక్షకుడు భూమిపై పుట్టాడు. భయాందోలనల్లో, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ఒక ...
Read More »మెగా ఫ్యామిలీపై రీమేక్స్ కామెంట్స్.. చరణ్ స్ట్రాంగ్ కౌంటర్
మెగా ఫ్యామిలీ రీమేక్స్పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్కు రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రీమేక్స్ అయినా అవి కూడా సినిమాలేనని గుర్తుంచుకోవాలన్నాడు. ధృవ సినిమా కోసం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. డల్లాస్లోని ఎన్నారైలతో ప్రత్యేకంగా మీట్ అయ్యాడు. మెగా అభిమానుల మధ్య ‘మెగా ఫ్యామిలీ రీమేక్స్’పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేశాడు. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసమే రీమేక్స్ చేస్తున్నామన్నాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు.. అని కాకుండా ముందు మనందరం భారతీయులమనీ, అదే విధంగా ...
Read More »రీకౌంటింగ్లో ట్రంప్దే గెలుపు
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పుడంతా ట్రంప్ హవా నడుస్తోంది. ప్రపంచమంతా ట్రంప్ వైఖరిని సైలెంట్గా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల పట్ల కాబోయే అధ్యక్షుడి వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టమవుతోంది. విజయం అసాధ్యం అని ట్రంప్పై దుమ్మెత్తి పోసిన వాళ్లే.. ఇప్పుడు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకో.. నమ్మకం లేకనో.. గ్రీన్ పార్టీ తరపున ప్రెసిడెంట్గా పోటీ చేసిన జెల్ల్ స్టెయిన్.. ఫలితాల రీకౌంటింగ్కు పిటిషన్ వేశారు. దీంతో పెనస్లేవియా, విస్కన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరిగింది. ఈ రీకౌంటింగ్లో అద్భుతం ...
Read More »గల్ప్ కుటుంబాల గోస
నందిపేట, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుటుంబ సభ్యులను పోషించడానికి పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ప్ దేశాలైన సౌదీ, దుబాయ్, ఖతర్, కువైట్, ఒమన్, బెహ్రెయిన్ దేశాలకు వలసవెళ్లిన కుటుంబ సభ్యుల గోస వర్ణనాతీతంగా ఉంది. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోడి 500, 1000 నోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో వచ్చిన సమస్యలలో ముఖ్యంగా బ్యాంకుల్లో ప్రతిరోజు విత్డ్రా పరిమితి విధించడంతో గల్ప్ నుండి కుటుంబ పోషణ కొరకు పంపిస్తున్న డబ్బు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. భారతదేశం నుంచి ...
Read More »అమెరికాకు పోటెత్తిన భారత విద్యార్థులు
విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానం అమెరికా చట్టసభల్లోనే కాదూ… అక్కడి విద్యాసంస్థల్లోనూ భారత ప్రాతినిధ్యం పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 2015-16 కాలానికి మొత్తం 1,65,918 మంది భారత విద్యార్థులున్నారు. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 25శాతం ఎక్కువ! ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్పై 2016 సంవత్సరానికి ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం… 2015-16 కాలంలో అమెరికాలో మొత్తం 10,44,000 మంది కాలేజీ, యూనివర్సిటీ స్థాయి విదేశీ విద్యార్థులు ...
Read More »